బావిలో పడి విద్యార్థిని మృతి | Sakshi
Sakshi News home page

బావిలో పడి విద్యార్థిని మృతి

Published Sat, Oct 31 2015 3:04 PM

The student died in well

నీళ్లు తొడటానికని బావి వద్దకు వెళ్లిన విద్యార్థిని ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందిన సంఘటన అదిలాబాద్ జిల్లా కౌథాల మండలం వీర్‌వెల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉష(16) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ రోజు తాగునీరు తేవడానికి బావి వద్దకు వెళ్లింది. బావిలోంచి నీరు చేదే క్రమంలో ప్రమాదవశాత్తూ బావిలో జారిపడింది.

ఇది గుర్తించిన స్థానికులు ఆమెను బయటకు తీయడానికి ప్రయత్నించేలోపే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement