ఆ రాయే ప్రాణం నిలిపింది | That made life raye | Sakshi
Sakshi News home page

ఆ రాయే ప్రాణం నిలిపింది

Jan 14 2015 3:33 AM | Updated on Sep 2 2017 7:39 PM

ఆ రాయే ప్రాణం నిలిపింది

ఆ రాయే ప్రాణం నిలిపింది

బోరుబావిలో పడిన చిన్నారి క్షేమం గా బయటపడింది. ఆ రాయే ఆమె ప్రాణాలు నిలిపింది. 10 ఫీట్ల లోతులో ఉన్న రా యి చిన్నారిని మరింత కిందకు జారకుం డా ఆపింది.

పరిగి/కుల్కచర్ల(రంగారెడ్డి జిల్లా): బోరుబావిలో పడిన చిన్నారి క్షేమం గా బయటపడింది. ఆ రాయే ఆమె ప్రాణాలు నిలిపింది. 10 ఫీట్ల లోతులో ఉన్న రా యి చిన్నారిని మరింత కిందకు జారకుం డా ఆపింది. సహాయక చర్యలు వేగంగా చేపట్టి జిల్లా యంత్రాంగం నందిని అలియాస్ అంజలిని(6) ప్రాణాలతో కాపాడగలిగింది. మంగళవారం సాయంత్రం జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ సంఘటన చివరకు సుఖాంతమైంది.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్, బుజ్జిబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.

ఆ నలుగురిలో నందిని(6) వారికి చివరి సంతానం. బతుకుదెరువు కోసం లక్ష్మణ్ దుబాయికి బుజ్జిబాయి పూణె వలస వెళా ్లరు. అయితే కుమారులు పెద్దవాళ్లు కావడంతో ముదిరెడ్డిపల్లి తండాలోనే ఉంటూ చదువుకుంటున్నారు. ఇక ఇద్దరు కుమార్తెలు చిన్నవారు కావడంతో వారిని గోవిం దుపల్లిలోని తన తల్లిగారింట వదిలి బుజ్జిబాయి వలస వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం అమ్మమ్మ సీతాబాయి, తాత భోజ్యానాయక్‌లు తండా సమీపంలోని పొలంలో పనికి వెళ్లగా నందిని(6) కూడా వారితోపాటే వెళ్లింది. అప్పటివరకు అక్కడ ఆడుకున్న బాలిక బోరుబావి లోడింది.

చిన్నారి జాడ లేకపోవడంతో చుట్టుపక్కల వెతకగా.. బోరుబావులో ఏ డ్పు వినిపించింది. దీంతో అందులో పడిపోయిందని స్పష్టమైంది. రెండున్నర గంటల సహాయక చర్యలు ఇక బోరుబావిలో పది ఫీట్ల కింద ఉన్న రాయి చిన్నారి మరింత లోతుకు జారకుండా అడ్డుకుంది. ఇక చిన్నారి బోరుబావిలో పడిందన్న విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ రాములు హుటాహుటినా పోలీసులకు, 108కు సమాచారం అందించారు.

ఇక రాత్రి 7 గంటల వరకు జేసీబీ, పోలీసులు, 108 వాహనం ఘటనా స్థలానికి చేరకున్నాయి. 108 సిబ్బంది బోరుబావిలో చిన్నారికి ఆక్సిజన్ అందించగా జేసీబీ బోరుబావికి సమాంతరంగా తవ్వకం ప్రారంభించింది. రాత్రి 9.30 గం టల ప్రాంతంలో బోరుబావి నుంచి చిన్నారిని విజయవంతంగా బయటకు తీశారు. అయితే చిన్నారి ప్రాణాలకు ఎలాంటి అపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే చిన్నారిని 108లో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, రంగారెడ్డి జిల్లా మంచాలలో జరిగిన ఘటనను  మర వకముందే అలాంటి ఘటనే చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement