'కేసీఆర్ సర్కారు గొప్పలకు పోయింది' | shabbir ali blames kcr sarkar | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ సర్కారు గొప్పలకు పోయింది'

Dec 27 2014 2:06 PM | Updated on Aug 15 2018 9:27 PM

'కేసీఆర్ సర్కారు గొప్పలకు పోయింది' - Sakshi

'కేసీఆర్ సర్కారు గొప్పలకు పోయింది'

తెలంగాణలో కేసీఆర్ సర్కారు గొప్పలకు పోయే రూ. లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కారు గొప్పలకు పోయే రూ. లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. బడ్జెట్ ను భారీగా ప్రవేశపెట్టినా.. ఇప్పటి వరకూ విడుదల చేసింది మాత్రం రూ.21 వేల కోట్లేనని ఎద్దేవా చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ.. వచ్చే మూడు నెలల కాలంలో మిగిలిన రూ. 80 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తార్ కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

 

ఈ క్రమంలోనే భారీ స్థాయిలో నిధులకు కోత పెట్టే అవకాశం ఉందని షబ్బీర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నా.. ఇంకా కరువు మండలాలను ప్రకటించలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement