రాజధానిలో గణేశ్ నిమజ్జన భద్రతా ఏర్పాట్లపై డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మంగళవారం జరిగే వినాయక నిమజ్జనానికి 26 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అనురాగ్శర్మ తెలిపారు. రాష్ట్ర పోలీసుశాఖలోని ప్రత్యేక బెటాలియన్లు, ఆర్మ్డ్ రిజర్వ్, పారామిలిటరీ బలగాలతో కలసి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర పోలీసు హెడ్క్వార్టర్స్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబరాబాద్, రాచకొండ, సిటీ కమిషనరేట్లలో మొత్తం 25,850 విగ్రహాలు ఏర్పాటయ్యాయని, ఒక్క హైదరాబాద్ కమిషన రేట్ పరిధిలోనే 11,572 విగ్రహాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో సగం వరకు విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. నిమజ్జన రూట్మ్యాప్ ఆధారంగా మొత్తం సీసీటీవీలను ఏర్పాటు చేశామని, సిటీ కమిషనరేట్, డీజీపీ కార్యాలయంలో కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఏరియల్ సర్వే కూడా చేస్తామని వివరించారు. నిమజ్జన బందోబస్తును పర్యవేక్షించేందుకు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పదకొండు మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, పదిహేను మంది ఎస్పీలు, ఏడుగురు అదనపు ఎస్పీలు, 132 మంది డీఎస్పీలు, 349 మంది ఇన్స్పెక్టర్లు, 1,209 మంది ఎస్సైలు, 11,642 మంది కానిస్టేబుళ్లను రంగంలోకి దించామన్నారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు, వాహనదారులకు ఎప్పటికప్పుడు నగర కమిషనరేట్ తగు సూచనలిస్తుందన్నారు. జీహెచ్ఎంసీ, విద్యుత్శాఖ, వాటర్ బోర్డు విభాగాలతో అత్యవసర సేవల బృందాలనూ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాల్లో ఇప్పటికే సగం మేర గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని, భైంసా, వరంగల్ తదితర సున్నిత ప్రాంతాల్లోనూ అదనపు బలగాలను రంగంలోకి దించి ప్రశాంత వాతావరణంలో మంగళవారం నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేస్తామని డీజీపీ తెలిపారు. కిందటి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
26 వేల మందితో బందోబస్తు
Published Tue, Sep 5 2017 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement