ఎల్బీనగర్ లో ఆర్టీఏ దాడులు | rta rides on school buses in lb nagar | Sakshi
Sakshi News home page

ఎల్బీనగర్ లో ఆర్టీఏ దాడులు

Jun 15 2015 12:42 PM | Updated on Sep 15 2018 5:49 PM

ఎల్బీనగర్‌లో స్కూల్‌, కాలేజీ బస్సులపై ఆర్టీసీ అధికారులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో స్కూల్‌, కాలేజీ బస్సులపై ఆర్టీసీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న నాలుగు కాలేజీ బస్సులను సీజ్‌ చేశారు. మరో రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు. అంతేకాక 60ఏళ్ల పైబడిన డ్రైవర్‌.. ఓ స్కూల్‌ బస్ ను నడుపుతుండగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి బస్సును సీజ్‌ చేశారు. ఈ దాడులు కొనసాగుతాయని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అధికారి తెలిపారు. వేలకు వేలు ట్రాన్స్‌పోర్ట్‌ ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్‌ యాజమాన్యాలు... బస్సుల ఫిట్‌నెస్‌ గురించి కూడా ఆలోచించాలంటున్నారు అధికారులు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement