జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సాక్షాత్తూ ఆ ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంవో) నరేందర్ కుమార్కే సకాలంలో వైద్యం అందలేదు.
ఆర్ఎంవోకే అందని వైద్యం
Mar 27 2017 5:58 PM | Updated on Aug 15 2018 5:57 PM
నిజామాబాద్: జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సాక్షాత్తూ ఆ ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంవో) నరేందర్ కుమార్కే సకాలంలో వైద్యం అందలేదు. సోమవారం ఆయన డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చేరారు.
బీపీ ఎక్కువైన సమయంలో డ్యూటీ డాక్టర్కు చెప్పినా ఆయన వెంటనే స్పందించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో డీఎంహెచ్వో, ఆస్పత్రి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. కొందరు వైద్యుల కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు చెడ్డపేరు వస్తోందని నరేందర్ కుమార్ ఆరోపించారు.
Advertisement


