ఏడుగురిని బలిగొన్న పిడుగులు | Rain in telangana with thunderbolts | Sakshi
Sakshi News home page

ఏడుగురిని బలిగొన్న పిడుగులు

Sep 27 2017 5:41 PM | Updated on Sep 28 2017 1:54 AM

 Rain in telangana with thunderbolts

పలువురి పరిస్థితి విషమం.. వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు

ఖిల్లాఘనపురం/చింతలపాలెం/కుల్కచర్ల/ఐనవోలు: ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒక్కసారిగా కన్నెర్రజేసింది.. బుధవారం వేర్వేరుచోట్ల పనుల్లో ఉన్న జనంపై పిడుగులు పడటంతో ఏడుగురు మృతి చెందారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటలో ఓ వేడుకలో పాల్గొనే పాల్గొనేందుకు వచ్చిన పెద్దమందడి మండలం జంగమాయపల్లి గ్రామానికి చెందిన రాములు(55), మాజీ సైనికుడు కృష్ణయ్య(56),  సోహెల్‌(8)  దర్గా సమీపంలోని వేపచెట్టు కిందకు చేరుకున్నారు. ఇంతలో పెద్ద శబ్దం చేస్తూ వేప చెట్టుపై పిడుగు పడగా అందరూ స్పృహ తప్పి పడిపోయారు. కాసేపటికి షాక్‌ నుంచి తేరుకున్న కొందరు గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిస్థితి విషమంగా ఉన్న వారిని ట్రాక్టర్‌లో గ్రామానికి తీసుకు వెళ్లారు.

108 అంబులెన్స్‌ సిబ్బంది పరీక్షించి కృష్ణయ్య(56), రాములు(55), సోహెల్‌(8) మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురానికి చెందిన అనసూర్యమ్మ (52), వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం అడవివెంకటాపూర్‌ అనుబంధ బజ్యానాయక్‌ తండాకు చెందిన నరేశ్‌ (22), వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని ఐనవోలు మండల కేంద్రానికి చెందిన గడ్డం రాజేశ్‌ (26), బొల్లెపెల్లి నరేశ్‌ (26)లు పడుగుపాటుకు మృతి మృతి చెందారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement