మెదక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం
సంగారెడ్డి టౌన్: ఓ నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసిన ఘటన బుధవారం మెదక్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి మండలానికి చెందిన కవిత నిండు గర్భిణి. డెలివరీ కోసం సోమవారం సం గారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరింది. కవితకు సిజేరియన్ చేస్తామని చెప్పిన వైద్యులు.. రక్తం తక్కువగా ఉందని, వేరే ఆసుపత్రికి వెళ్లాలని బుధవారం బయటకు పంపి తలుపులు వేసేశారు. ఏమి చేయాలో తోచక ఆసుపత్రి ఆవరణలోనే ఉండిపోయింది. ఆమె లోపలికి వస్తుందేమోనని సిబ్బంది గంటలకొద్దీ తలుపులు మూసేశారు. దీంతో ఆ వార్డులోని బాలింతలు, గర్భిణుల సహాయకులు బయటే ఉండిపోయారు.
ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలనే: గర్భిణి తల్లిదండ్రులు
కవిత ఆరు నెలలుగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకుంటోందని ఆమె తల్లిదండ్రులు యాదమ్మ, రంగయ్య తెలి పారు. సంగారెడ్డిలోని ఆ డాక్టర్కు చెందిన ప్రైవేటు ఆసుపత్రిలో ప్రతి నెలా వైద్యపరీక్షలు చేయించుకుందన్నారు. పేదరికం కారణంగా డెలివరీ కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిందని తెలిపారు. తీరా సిజేరియన్వేళ రక్తం లేదంటూ తమ కూతురును బయటికి వెళ్లగొట్టారని వారు కంట తడిపెట్టారు.
ఈ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని, అక్కడికి పంపాలనే ఉద్దేశంతో ఆసుపత్రి సిబ్బంది ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ‘ఆస్పత్రి లోపల ఆపరేషన్ అయిన బిడ్డ ఒక్కతే ఉంది. పొద్దున్నుంచి తలుపులు తెరుస్తలేరు.’ అని ఓ బాలింత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయ త్నించగా వైద్యులెవరూ ముందుకు రాలేదు. ఇన్చార్జి సూపరింటెండెంట్ను ఫోన్లో ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
నిర్దాక్షిణ్యంగా నిండు గర్భిణి గెంటివేత
Published Thu, Jan 7 2016 3:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement