'ఆహార భద్రత' కోసం ఆందోళన | people srike for food security cards and items in nizamabad district | Sakshi
Sakshi News home page

'ఆహార భద్రత' కోసం ఆందోళన

Jan 22 2015 5:31 PM | Updated on Oct 2 2018 8:49 PM

ఆహారభద్రత కార్డులు, సరుకుల కోసం నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద మండల గ్రామస్తులు గురువారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేశారు.

ఆహారభద్రత కార్డులు, సరుకుల కోసం నిజామాబాద్ జిల్లాలోని బిచ్కుంద మండల గ్రామస్తులు గురువారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు మంజూరు చేయడం లేదని వారు వాపోయారు. ఆహార భద్రత కార్డలు మంజూరు చేసిన వారికి సైతం సరుకులు ఇవ్వడంలేదని వారు ఆరోపించారు.

ప్రభుత్వం స్పందించి అర్హులకు కార్డులు మంజూరు చేయాలని, కార్డులున్న వారికి రేషన్ సరుకులు అందజేయాలని బిచ్కుంద మండల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు స్థానిక కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement