
ప్రపంచకప్ 2019 టోర్నీ నేపథ్యంలో క్రికెట్ ప్రియులకు #WorldCupWithParadise
సాక్షి, హైదరాబాద్ : ప్యారడైజ్ హోటల్స్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచకప్ 2019 టోర్నీ నేపథ్యంలో క్రికెట్ ప్రియులకు #WorldCupWithParadise అనే పోటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోటీలో పాల్గొని గెలిచిన వారికి ఏడాదిపాటు వారంలో ఒక బిర్యానీ చొప్పున 52 వారాలు ఉచితంగా బిర్యానీని గిఫ్ట్ రూపంలో పొందవచ్చని వెల్లడించింది. ఈ పోటీ జూన్ 7 నుంచి జూలై 18వ తేదీ 2019 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, విజేతలకు ప్రతివారం బహుమతులు అందిస్తామని ప్యారడైజ్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. బిర్యానీ ప్రియులు ఈ నిర్ణీత సమయంలో ప్యారడైజ్ ఫుడ్ కోర్టుల డైన్ ఇన్/ఎక్స్ప్రెస్ ఔట్లెట్లకు కుటుంబం, స్నేహితులతో విచ్చేసి ఈ పోటీ గురించి వివరంగా తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రికెట్ సీజన్ తమ వినియోగదారులకు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈపోటీని తీసుకువచ్చినట్లు సంస్థ సీఈవో గౌతం గుప్తా తెలిపారు. ఇక ఐపీఎల్ సందర్భంగా ప్యారడైజ్ రెగ్యూలర్ కస్టమర్లకు ఉచితంగా బిర్యానీతో పాటు ఐపీఎల్ టికెట్లు అందజేసిన విషయం తెలిసిందే.