
ఇక ‘పార్కింగ్’ పాలసీ
రాజధానితో సహా రాష్ట్రంలోని పట్టణాల్లో వాహనాల పార్కింగ్ను నియంత్రించేందుకు త్వరలో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని పురపాలక మంత్రి కె.తారకరామా రావు
⇔ పార్కింగ్కు స్థలమిస్తే ప్రోత్సాహకాలు: కేటీఆర్
⇔ పార్కింగ్ స్థలాల్లో నిర్మాణాలు కూల్చేస్తాం
⇔ హైదరాబాద్ సహా అన్ని పట్టణాల్లో అమలు
⇔ హైదరాబాద్లో మల్టీ లెవెల్ పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: రాజధానితో సహా రాష్ట్రంలోని పట్టణాల్లో వాహనాల పార్కింగ్ను నియంత్రించేందుకు త్వరలో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని పురపాలక మంత్రి కె.తారకరామా రావు గురువారం వెల్లడించారు. నగరాలు, పట్టణాల్లో పార్కింగ్ సమçస్యపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘‘రోడ్లను పరి రక్షించడం, రద్దీని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా పాలసీ ఉం టుంది. నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలు కల్పి స్తాం. ఖాళీ ప్రదేశాలను పార్కింగ్కు ఇచ్చేవారికి ప్రోత్సాహకా లిస్తాం’’ అని తెలిపారు. పార్కింగ్ కోసం ఉద్దేశించిన ప్రదేశాల్లో కట్టిన కాంప్లెక్సుల కూల్చివేతలను తక్షణమే చేపట్టాలని చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారిని ఆదేశించారు.
కొత్త భవనాల నిర్మాణం లో నిర్దేశించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని పార్కింగ్కు కేటాయిస్తే భవన నిర్మాణ అనుమతుల్లో ప్రత్యేక సడలింపులిచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ‘‘మెట్రో స్టేషన్లకు ట్రాఫిక్ ఇబ్బం దులు ఎదురవకుండా వాటికి అనుబంధంగా మల్టీ లెవెల్ పార్కి ంగ్, స్కై వాక్స్ సదుపాయాలను ఏర్పాటు చేయండి. పోలీస్ సిబ్బంది, నిపుణులతో కలసి సమగ్ర ప్రణాళిక రూపొందిం చండి’’ అని ఆదేశించారు. సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, నగర పోలీస్ కమీషనర్ మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ, హెచ్ఎం డీఏ కమిషనర్లు బి.జనార్దన్రెడ్డి, చిరంజీవులు పాల్గొన్నారు.