62 ఎకరాల్లో విస్తరించిన ‘సాగి’ చెరువు...1993 వరకూ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహణ. కోదాడ పట్టణానికి సమీపంలో ఉండడం, భూములకు విలువ పెరగడంతో కబ్జాదారుల కన్ను ఈ చెరువుపై పడింది. ఓ సర్వేయర్, నీటిపారుదలశాఖలో పనిచేసిన ఓ ఉద్యోగి, శ్రీరంగాపురం గ్రామానికి చెందిన నేత ఆక్రమణ పర్వానికి తెరలేపారు. ఇంకేముంది ఆ చెరువు ఆనవాళ్లే నేడు కనిపించకుండా పోయాయి. చెరువుల పునరుద్ధరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండడంతో కబ్జాకోరల్లో చిక్కుకున్న సాగి చెరువుకు విముక్తి లభిస్తుందేమో వేచి చూడాల్సిందే.
కోదాడ గ్రామ పంచాయతీలోని శ్రీరంగాపురం గ్రామాన్ని ఆనుకొని సర్వేనంబర్లు 753, 755, 756, 757, 758, 552, 553లలో సాగి చెరువు విస్తరించి ఉన్నట్లు పాతరికార్డులను బట్టి తెలుస్తోంది. సాగర్ కాల్వ రావడంతో ఈ చెరువు అవసరం లేకపోవడం, దీనికింద సాగువుతున్న భూములు ఇళ్ల ప్లాట్లుగా మారడంతో నాడు కోదాడ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సర్వేయర్, నీటిపారుదలశాఖలో పని చేసిన ఓ ఉద్యోగి, శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఓ నాయకుడు చెరువు కబ్జాకు తెరతీశారు. ముందస్తుగా రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులను మాయం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ తరువాత చెరువులో నీరు నిలువఉండకుండా చేసేందుకు రాత్రి సమయాల్లో అలుగుతో పాటు కట్టను కూడా సగానికిపైగా తొలగించారు. అనంతరం చెరువు భూమితోపాటు మునక భూమిని కబ్జా చేశారు. చెరువు కింద భూములను ఇళ్ల ప్లాట్లుగా మార్చడంతో పైభాగంలో చెరువు లేకుంటే తమ భూములకు మరింత విలువ వస్తుందని రైతులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో అక్రమార్కుల పని సులువైంది.
రెవెన్యూ రికార్డులు మాయం
సాగిచెరువు వివరాలను కొందరు రెవెన్యూ అధికారులు కావాలనే మాయం చేశారు. కానీ నీటి పారుదల శాఖ వద్ద, పంచాయతీరాజ్ శాఖ వద్ద ఈ చెరువుకు సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ చెరువు కట్ట 520 మీటర్ల పొడవు ఉండగా దీనిలో సగానికి పైగా ఆక్రమణదారులు తొలగించారు. ఐబీ అధికారులు ఈ చెరువు కింద సాగవుతున్న 82.18 ఎకరాల భూమికి 40ఏళ్లుగా శిస్తు వసూలు చేస్తున్నారు. 1993 వరకు చెరువు కట్ట నిర్వహణను పంచాయతీరాజ్ శాఖ చూసినట్లు రికార్డులో స్పష్టంగా ఉంది. ఫైల్నంబర్ బీ/1285/93 ప్రకారం శ్రీరంగాపురం సాగి చెరువు కట్ట 520 మీటర్లు ఉందని ఇది బలహీనంగా ఉండడంతో రాతితో రివిటింగ్ చేయాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. చెరువు విస్తీర్ణం మునకతో సహా 62 ఎకరాలు ఉందని దీనికి రెండు తూములు , అలుగు ఉన్నట్లు అధికారులు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
రూ. 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కూడా..
ఈ చెరువు భూమితోపాటు ఇందులో మునకగా ఉన్న భూదానభూమి, అసైన్డ్ భూమి కూడా ఆక్రమణకు గురైంది. సర్వేనంబర్ 753లో రెండు ఎకరాల పది గుంటలు, సర్వేనంబర్ 758 లో 22 గుంటలు, దీంతోపాటు చెరువు శిఖంలో సర్వేనంబర్లు 755, 756, 757 లలో నాలుగు ఎకరాలు షేక్సింద్లకు ఏక్సాల్ పట్టాలు ఇచ్చారు. వీరంతా చెరువులో నీరులేనప్పుడు సాగు చేసుకోవాల్సిఉంది. అక్కడే కోదాడ మాజీ సర్ప ంచ్ సర్వేనంబర్ 753లో భూదానబోర్డుకు ఇచ్చిన ఎకరం 38 గంటల భూమి ఉంది. షేక్సింద్లకు ఇచ్చిన భూమి మొత్తం 6 ఎకరాల 30 గుంటలు ప్రస్తుతం వేరేవారి చేతుల్లోకి వెళ్లింది. ఈ ప్రభుత్వ భూమి విలువే దాదాపు రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇక భూదానభూమిని కూడా కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికీ చెరువు ఆనవాళ్లు..
రెవెన్యూ రికార్డుల్లో శ్రీరంగాపురం సాగి చెరువును మాయం చేసినప్పటికీ అక్కడ చెరువు ఉన్నట్లు ఇప్పటికీ ఆ ప్రదేశంలో స్పష్టమైన ఆనవాళ్లు ఉన్నాయి. గ్రామానికి చెందిన 50 సంవత్సరాలు పైబడిన వారిని ఎవరిని అడిగినా చెరువు గురించి చెబుతారు. ఈ చెరువుకట్టను కబ్జాదారులు సగం తొలగించగా మరికొంత భాగాన్ని పేదలు చదును చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ చెరువు పై భాగం నుంచి ఇటీవల బైపాస్రోడ్డు నిర్మించారు. బైపాస్రోడ్డు కోసం 2003లో సర్వే చేసిన సమయంలో సర్వే రిపోర్టులో సాగి చెరువు ఉన్నట్లు మ్యాప్తో సహా చీఫ్ ఇంజినీర్లు స్పష్టంగా పేర్కొన్నారు.
ఆక్రమణలు సాగిపోయాయి
Published Thu, Oct 2 2014 2:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement