తెలంగాణ సర్కార్ పని చేయటం మానేసి పండుగలు చేస్తోందని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ పని చేయటం మానేసి పండుగలు చేస్తోందని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం రైతులు దసరా చేసుకునే పరిస్థితిలో లేరని ఆయన శనివారమిక్కడ అన్నారు. విద్యుత్ సమస్యలతో రైతాంగం సతమతం అవుతుందన్నారు. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదని, నాలుగు నెలల్లో ఒక్క రూపాయి కరెంట్ అయినా కొన్నారా అని నాగం ప్రశ్నించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.