మిషన్ కాకతీయకు క్రెడాయ్ 50 లక్షల విరాళం | kredai gives RS. 50 lacks for mission kakatiya | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయకు క్రెడాయ్ 50 లక్షల విరాళం

Apr 30 2015 3:53 AM | Updated on Sep 3 2017 1:07 AM

చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం క్రెడాయ్ రూ.50 లక్షల విరాళం ప్రకటించింది.

హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం క్రెడాయ్ రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు క్రెడాయ్ సీఈఓ ఎంవీ రాజేశ్వర్‌రావు, చైర్మన్ బి.సుధాకర్‌రావు, ప్రతినిధులు శేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్, కె.రాంరెడ్డి బుధవారం నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావును కలసి తొలి విడతగా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 11 చెరువులను దత్తత తీసుకుంటామని మంత్రితో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement