{yైవర్లు, జర్నలిస్టులు, హోంగార్డులకు సౌకర్యం: నాయిని
ఈ నెల 22 నుంచే అందుబాటులోకి..
హైదరాబాద్: రూపాయి ఖర్చు లేకుండా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ప్రీమియం కల్పిస్తున్నట్లు హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. సామాజిక భద్రతలో భాగంగా డ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డులు తదితరులు మొత్తం దాదాపు 10 లక్షల మందికి ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయం ఈ నెల 22 నుంచే అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక దినోత్సవం ‘మేడే’ రోజున సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ప్రీమియం లేకుండా ఉచితంగా ఆరోగ్య, ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల డబ్బు ఖర్చు లేకుండా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య చికిత్సలు చేయించుకోవచ్చన్నారు. ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు రూ. 5 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. పథకం అమలుకు కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్శాఖ సెక్రటరీ, హోంగార్డ్స్ ఐజీ, సమాచార డెరైక్టర్తో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ పథకానికి నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని నాయిని తెలిపారు. ఈ పథకంపై త్వరలోనే సామాజిక భద్రత పేరుతో జిల్లాల వారీగా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిప్రీత్సింగ్, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, హోంగార్డ్స్ ఐటీ బాలనాగదేవి, సమాచార పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ సుభాష్ పాల్గొన్నారు.
ఉచితంగా రూ.5 లక్షల బీమా
Published Sat, Aug 29 2015 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement