మెట్రో రైలు టికెట్‌ కనీస ధర ఎంతో తెలుసా? | Hyderabad Metro Rail fare minimum fare at Rs 10 | Sakshi
Sakshi News home page

మెట్రో రైలు టికెట్‌ కనీస ధర రూ.10

Nov 25 2017 10:07 AM | Updated on Sep 4 2018 3:39 PM

Hyderabad Metro Rail fare minimum fare at Rs 10 - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న హైదరాబాద్‌ మెట్రో రైలు టికెట్‌ ఛార్జీలపై స్పష్టత వచ్చింది.  మెట్రో రైలు టికెట్ కనీస ధర రూ.10గా ఖరారు చేసింది. అలాగే నాగోల్‌ నుంచి మెట్టుగూడకు ప్రయాణించాలంటే ప్రయాణికులు రూ.25 చెల్లించాల్సిందే.  గతంలో మెట్రో రైలు టికెట్ కనిష్ట ధర రూ.8, గరిష్ట ధర రూ.19, ఫుల్ డే పాస్ 40రూపాయలుగా ఉండనున్నట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మెట్రో ప్రాజెక్టు వ్యయం పెరగడంతో మెట్రో రైలు చార్జీలను సవరించాలని ఎల్‌అండ్‌టీ నిర్ణయించింది. మరోవైపు టికెట్‌ గరిష్ట ధరపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కాగా మెట్రో రైలు ప్రయాణాన్ని ‘స్మార్ట్‌’ చేస్తున్నారు. టిక్కెట్ల గోల లేకుండా మెట్రో స్మార్ట్‌ కార్డు ‘నెబ్యులా’ను తీసుకొస్తున్నారు. దీని ధర రూ.100, మరో రూ.100తో రీచార్జి చేసుకోవాలి. అంతేకాదు గరిష్టంగా రూ.2 వేల వరకు రీచార్జి చేసుకోవచ్చు. ఈ కార్డులను ఈనెల మూడో వారం నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌ విక్రయాలకు త్వరలో వెబ్‌సైట్‌ను ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రారంభించనుంది.

మనం బయలుదేరే స్టేషన్‌ మొదటి అంతస్తులోని ‘ఆటోమేటిక్‌ ఫెయిర్‌ కలెక్షన్‌’ గేటు వద్ద ఈ కార్డును స్వైప్‌ చేయాలి. రైలు దిగాక స్టేషన్‌లోని ఎగ్జిట్‌ గేటు వద్ద మరోమారు స్వైప్‌ చేస్తే చాలు.. ప్రయాణించిన దూరానికి అయిన చార్జీ కార్డు నుంచే కట్‌ అవుతుంది. భవిష్యత్‌లో ఈ కార్డుతో ఆర్టీసీ, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, మెట్రోమాల్స్, స్టేషన్లలో షాపింగ్‌.. ఇలా 16 రకాల సేవలు పొందే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement