భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త | Husband catches fire to wife | Sakshi
Sakshi News home page

భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

Feb 27 2015 10:46 PM | Updated on Sep 2 2017 10:01 PM

భార్యతో గొడవ పడిన ఓ కిరాతకుడు ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

పహాడీషరీఫ్: భార్యతో గొడవ పడిన ఓ కిరాతకుడు ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం...తుక్కుగూడ ప్రాంతానికి చెందిన హనుమళ్ల జ్యోతి (25), సత్తయ్యలు భార్యాభర్తలు. లేబర్ పని చేసే వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా సత్తయ్య, జ్యోతిలు తరచూ గొడవ పడుతుండేవారు.

ఈ క్రమంలోనే గురువారం రాత్రి కూడా గొడవ పడి ఆగ్రహానికి గురైన సత్తయ్య.. జ్యోతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. జ్యోతి అరుపులు గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం పోలీసుల సాయంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలకు గురైన జ్యోతి తనపై భర్తే కిరోసిన్ పోసి నిప్పంటించాడని వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement