వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన గవర్నర్‌ దంపతులు

Governor Narasimhan Inaugurated Annual Sports Competitions In Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ ఉద్యోగులకు నిర్వహించే వార్షిక క్రీడాపోటీలను గవర్నర్‌ దంపతులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ షటిల్‌ ఆడారు. ఆయన సతీమణి విమలా నరసింహన్‌ మహిళాఉద్యోగులతో కలసి క్యారమ్స్‌ ఆడారు. విజిలెన్స్‌ అవేర్నెస్‌ వీక్‌– 2018లో భాగంగా ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌ సింగ్‌ రాజ్‌భవన్‌ ఉన్నతా«ధికారులు, ఉద్యోగులతో కలసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గవర్నర్‌ సలహాదారు ఏపీవీఎన్‌ శర్మ, ఏకే మహంతి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top