మాఫియా నాయకులంతా 'కారు' ఎక్కుతున్నారు | G.Kishan reddy takes on trs party leaders | Sakshi
Sakshi News home page

మాఫియా నాయకులంతా 'కారు' ఎక్కుతున్నారు

Jan 29 2015 2:07 PM | Updated on Mar 28 2019 8:41 PM

మాఫియా నాయకులంతా 'కారు' ఎక్కుతున్నారు - Sakshi

మాఫియా నాయకులంతా 'కారు' ఎక్కుతున్నారు

మాఫియా నాయకులంతా టీఆర్ఎస్లో చేరుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు కిషన్రెడ్డి గురువారం హైదరాబాద్లో ఆరోపించారు.

హైదరాబాద్: మాఫియా నాయకులంతా టీఆర్ఎస్లో చేరుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు కిషన్రెడ్డి గురువారం హైదరాబాద్లో ఆరోపించారు. ఇసుక, అక్రమ సారా మాఫియా నాయకులంతా టీఆర్ఎస్లోనే ఉన్నారని ఆయన విమర్శించారు. బెల్ట్ షాపులపై వైఖరి ఏమిటో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ ధరలు పెంచడానికే కేసీఆర్ హెలికాప్టర్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు బీజేపీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు చేస్తామని... అలాగే 5వ తేదీన సమీక్ష నిర్వహిస్తామని కిషన్రెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement