మండల కేంద్రంలోని జమ్మాపురం సమీపంలోని టైర్ల కంపెనీలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
టైర్ల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
Apr 14 2017 7:58 AM | Updated on Sep 5 2018 9:47 PM
(యాదాద్రి)భువనగిరి: మండల కేంద్రంలోని జమ్మాపురం సమీపంలోని టైర్ల కంపెనీలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీ ప్రాంగణమంతా ఎగసిపడుతున్న మంటలు పొగతో నిండిపోయింది. ఉదయం 4.30 గంటల నుంచి ప్రారంభమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.15 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement