విద్యుదాఘాతానికి రైతు బలి | farmer died due to electric shock in adilabad district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి రైతు బలి

Jan 13 2016 8:14 PM | Updated on Oct 1 2018 4:01 PM

పంటను రక్షించుకోవడం కోసం పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ఓ రైతు ప్రాణాన్ని బలిగొన్నాయి.

ఆదిలాబాద్: పంటను రక్షించుకోవడం కోసం పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ఓ రైతు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలం చింతపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.


గ్రామానికి చెందిన కొక్కెర తిరుపతి(38) అనే రైతు అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బావి వద్ద  పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో తిరుపతి అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement