ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద పెట్రోల్‌తో రైతు హల్‌చల్‌

Farmer Comes With Petrol To MRO Office In Chigurumamidi - Sakshi

సాక్షి, కరీంనగర్‌: తహశీల్దార్‌ పాస్‌పుస్తకం ఇవ్వడంలేదన్న కారణంతో ఓ రైతుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తహశీల్దార్‌ కార్యాలయంపై ఏకంగా పెట్రోల్‌తో దాడికి దిగాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి ఎమ్మార్వో కార్యాలయంలో చోటుచేసుంది. వివరాలు.. లంబాడిపల్లికి చెందిన రైతు కనకయ్య తన పొలం పాస్‌పుస్తకాల కోసం గత కొంతకాలంగా తిరుగుతున్నాడు. కానీ పనిమాత్రం కావడంలేదు. రేపుమాపు అంటూ అధికారులు తిప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కార్యాలయానికి వచ్చిన కనకయ్య తనతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో హల్‌చల్‌ చేశాడు. పాస్‌పుస్తకం ఇవ్వడంలేదని ఆఫీసులోని కంప్యూటర్లపై పెట్రోల్‌​ పోశాడు. దీంతో వెంటనే తేరుకున్న అక్కడున్న సిబ్బంది ఆయన్ని వెంటనే బయటకు తోసేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. కనకయ్య పెట్రోల్‌తో రావడంతో కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.  ఈ ఘటరతో తహశీల్దార్‌ ఆఫీసు వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top