
సాక్షి, హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి జమున, కుటుంబసభ్యులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ టీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జమునతో పాటు రాజేందర్ కూతురు నీత, కోడలు క్షమిత ప్రచారంలో పాల్గొంటున్నారు.