ఇంటర్ వెయిటేజి మార్కులతో ఎంసెట్ ర్యాంకులు | Eamcet weightage marks for EAMCET exam | Sakshi
Sakshi News home page

ఇంటర్ వెయిటేజి మార్కులతో ఎంసెట్ ర్యాంకులు

May 20 2014 3:16 AM | Updated on Sep 2 2017 7:34 AM

ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ఖరారు చేస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ఖరారు చేస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. వీరిని మొదటి దశ కౌనె ్సలింగ్‌లో అనుమతిస్తామన్నారు. ఇక అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు వెయిటేజీ ఇచ్చి రెండో దశలో ర్యాంకులను ఖరారు చేస్తామని, ఆ తర్వాత కౌన్సెలింగ్‌కు వారిని అనుమతిస్తామని వెల్లడించారు. ఎంసెట్‌లో వచ్చే మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ర్యాంకులను ఖరారు చేయనున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement