ఓట్ల కోసం మా ఊరికి రావొద్దు | Sakshi
Sakshi News home page

ఓట్ల కోసం మా ఊరికి రావొద్దు

Published Sun, Oct 21 2018 1:44 AM

Do not come to our village for votes - Sakshi

తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ముజాహిదిపురం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. తమ గ్రామానికి ఏ పాలకుడూ ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు నది పక్కనే ఉన్నప్పటికీ గ్రామంలోని చెరువు ఎడారిలా మారిందని, మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతున్నా.. తాము గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నామని పేర్కొన్నారు.  తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం చేతకానప్పుడు ఓటు అడిగే హక్కు లేదని నినదించారు.  

Advertisement
Advertisement