కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ సమావేశం రణరంగంగా మారిం ది. కౌన్సిలర్లు పరస్పరం దాడులు చేసుకోవడంతో నాలుగు గం టలపాటు ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు లాఠీచార్జి చేసి పరి స్థితిని అదుపులోకి తెచ్చారు. మున్సిపల్ ప్యానల్, కాంట్రాక్టు కమిటీ ఎన్నికల కోసం శని వారం చైర్పర్సన్ సుష్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ప్రొటోకాల్ను పాటించడం లేదంటూ ముందుగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు కమిషనర్ తో వాగ్వాదానికి దిగారు.అదే సమయంలో సమావేశ మందిరంలోకి అడుగుపెట్టిన వైస్ చైర్మన్ మసూద్ అలీ చైర్పర్సన్ పోడియం పక్కన కుర్చీ వేయించుకు ని కూర్చున్నారు. ఇందుకు టీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం తెలుపుతూ అధికారులపై విమర్శలకు దిగారు. పోడియం ముందుకు వచ్చి ఆందోళన చేశా రు. దీంతో చైర్పర్సన్ సమావేశాన్ని అరగంటపాటు వాయిదా వేసి బయటకు వెళ్లిపోయారు.
కుర్చీలు విసురుకుని
ఇదే తరుణంలో వైస్ చైర్మన్, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీ లు విసురుకున్నారు. కొట్టుకున్నారు. దీంతో టీఆర్ఎస్ కౌన్సిలర్ భూంరెడ్డి పెదవులకు గాయం కావడం తో వైస్ చైర్మన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ కౌన్సిలర్లు కార్యాలయం ఎదుట బైఠాయిం చారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని వైస్చైర్మన్ను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. వైస్ చైర్మన్ మున్సిపల్ అతిథి గృహంలోకి వెళ్లడంతో టీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకున్నారు.
పోలీసులను తోసివేసి తలుపును ధ్వంసం చేసి బయటకు పడేశారు. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన పోలీసులు టీఆర్ఎస్ నేతలను పక్కకు తోసి వేశారు. వైస్ చైర్మన్ను బయటకు తీసుకువచ్చి కారులో ఎక్కించేందుకు యత్నించారు. ఇదే సమయంలో ఇరు పార్టీలవారు పరస్పరం దాడికి దిగారు. ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. వారిని నిలువరించినా ప్రయోజనం లేకపోవడంతో వైస్ చైర్మన్ను తిరిగి అతిథి గృహంలోకి తీసుకెళ్లారు. లా ఠీచార్జి చేసి గొడవకు దిగినవారిని తరిమికొట్టి, వైస్చైర్మన్ను, ఆయన కుమారుడిని బలవంతంగా లాక్కెళ్లి జీపులో ఎక్కించి ఠాణాకు తరలించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆందోళన విరమించారు.
కేసులు నమోదు
మున్సిపల్ సమావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్చైర్మన్ మసూద్, కౌన్సిలర్ జమీల్తో పాటు టీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు భూంరెడ్డి, సంగిమోహన్, ముప్పారపు ఆనంద్, కుంభాల రవి, అంజద్, మాసుల లక్ష్మీనారాయణలపై కేసులు నమోదు చేశా రు. ఇరు వర్గాలవారు పరస్పరం చేసుకున్న పిర్యాదు ల మేరకు కేసులు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
కొట్టుకున్న కౌన్సిలర్లు
Published Sun, Jul 20 2014 2:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement