హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం:పొన్నాల | congress party opposes secratariat changinging decesion says ponnala | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం:పొన్నాల

Feb 5 2015 4:41 PM | Updated on Aug 15 2018 9:27 PM

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం:పొన్నాల - Sakshi

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం:పొన్నాల

సచివాలయాన్ని ఎర్రడ్డకు, చెస్ట్ ఆస్పత్రిని అనంతగిరికి తరలించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రడ్డకు, చెస్ట్ ఆస్పత్రిని అనంతగిరికి తరలించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని  పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు శనివారం పాద యాత్ర నిర్వహించనున్నట్లు పొన్నాల చెప్పారు. సచివాలయ మార్పును ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు వినతిపత్రం ఇవ్వనున్నామని పొన్నాల తెలిపారు.

 

హైదరాబాద్ చెత్తసిటీ అంటూ సీఎం మాట్లాడటం సరైందికాదన్నారు. ఈ వ్యాఖ్యలు పెట్టుబడులకు అనుకూలమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని పొన్నాల విమర్శించారు. హైదరాబాద్ బెస్ట్ సిటీ అవార్డును కేటీఆర్ తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందునే హైదరాబార్ అభివృద్ధి గురించి చెబుతూ కేసీఆర్ ప్రజలని మభ్యపెడుతున్నారని పొన్నాల తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement