ప్రకటనలతో కేసీఆర్ కాలయాపన: జీవన్ రెడ్డి | Congress leader Jeevan Reddy criticises KCR's Government | Sakshi
Sakshi News home page

ప్రకటనలతో కేసీఆర్ కాలయాపన: జీవన్ రెడ్డి

Sep 23 2014 5:54 PM | Updated on Jun 4 2019 5:04 PM

ప్రకటనలతో కేసీఆర్ కాలయాపన: జీవన్ రెడ్డి - Sakshi

ప్రకటనలతో కేసీఆర్ కాలయాపన: జీవన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వానికి రైతులను ఆదుకునే ఆలోచన లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు

నిజమాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి రైతులను ఆదుకునే ఆలోచన లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఆర్ధిక భారం నుంచి తప్పించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ప్రకటనలతో కాలయాపన చేస్తున్నారని, గత నాలుగు నెలల్లో ఆయన చేసిందేమి లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. 
 
ఈనెల 30లోగా రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలివ్వాలని, లేకుంటే అక్టోబర్ మొదటి వారం తర్వాత రైతులు రోడ్డెక్కక తప్పదని జీవన్ రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement