రూ. 555 కోట్లకు కేంద్రం ఎసరు! | central government funds going to be collapse | Sakshi
Sakshi News home page

రూ. 555 కోట్లకు కేంద్రం ఎసరు!

Mar 18 2015 3:24 AM | Updated on Aug 20 2018 9:16 PM

పురపాలక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 555.64 కోట్ల ‘13వ ఆర్థిక సంఘం’ నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది.

సాక్షి, హైదరాబాద్: పురపాలక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 555.64 కోట్ల ‘13వ ఆర్థిక సంఘం’ నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నెలాఖరుతో 13వ ఆర్థిక సంఘం కాలపరిమితి తీరిపోతుండగా ఆ లోపు ఈ నిధులు విడుదల కాకుంటే రాష్ట్రానికి తీరని నష్టం కలగనుంది. భారీగా ఉన్నమొత్తం బకాయిలను విడుదలకు కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కరువైంది. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని 68 పురపాలక సంస్థలకు 2010-15 మధ్య కాలంలో 13వ ఆర్థిక సంఘం నుంచి మొత్తం రూ.894.79 కోట్ల నిధులు రావాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం రూ.319.23 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
 
పురపాలక ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోవడంతో 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచే ని ధులను కేంద్రం నిలిపివేసింది. అయితే ఈ ఎ న్నికలు ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నా, ని దులు పూర్తిగా విడుదలవ్వక బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఎన్నికల తర్వాత కేంద్రం గతేడాది 2 విడతల్లో రాష్ట్రానికి రూ. 126.72 కోట్లను విడుదల చేసింది. 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి ఇంకా రూ.628.84 కోట్లు విడుదల కావాల్సి ఉండగా 3 రోజుల కింద కేవలం రూ.73.10 కోట్లను వి డుదల చేసింది.  మిగిలిన రూ.555.64 కోట్ల బకాయిల విడుదలపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. వీటిలో రూ.112.57 కోట్లు వారంలో ఇస్తామన్న హామీ మాత్రమే లభించింది. ఒకవేళ ఈ నిధులు విడుదలైనా మిగతా రూ.443.07 కోట్లు మురిగిపోయే ప్రమాదం నెలకొంది. ఒకవేళ హామీ మేరకు రూ.112.57 కోట్లు సైతం విడుదల కాకపోతే మొత్తం రూ.555 కోట్లను రాష్ట్రం నష్టపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement