పురపాలక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 555.64 కోట్ల ‘13వ ఆర్థిక సంఘం’ నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది.
సాక్షి, హైదరాబాద్: పురపాలక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 555.64 కోట్ల ‘13వ ఆర్థిక సంఘం’ నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నెలాఖరుతో 13వ ఆర్థిక సంఘం కాలపరిమితి తీరిపోతుండగా ఆ లోపు ఈ నిధులు విడుదల కాకుంటే రాష్ట్రానికి తీరని నష్టం కలగనుంది. భారీగా ఉన్నమొత్తం బకాయిలను విడుదలకు కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కరువైంది. జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని 68 పురపాలక సంస్థలకు 2010-15 మధ్య కాలంలో 13వ ఆర్థిక సంఘం నుంచి మొత్తం రూ.894.79 కోట్ల నిధులు రావాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం రూ.319.23 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
పురపాలక ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోవడంతో 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచే ని ధులను కేంద్రం నిలిపివేసింది. అయితే ఈ ఎ న్నికలు ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నా, ని దులు పూర్తిగా విడుదలవ్వక బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఎన్నికల తర్వాత కేంద్రం గతేడాది 2 విడతల్లో రాష్ట్రానికి రూ. 126.72 కోట్లను విడుదల చేసింది. 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి ఇంకా రూ.628.84 కోట్లు విడుదల కావాల్సి ఉండగా 3 రోజుల కింద కేవలం రూ.73.10 కోట్లను వి డుదల చేసింది. మిగిలిన రూ.555.64 కోట్ల బకాయిల విడుదలపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. వీటిలో రూ.112.57 కోట్లు వారంలో ఇస్తామన్న హామీ మాత్రమే లభించింది. ఒకవేళ ఈ నిధులు విడుదలైనా మిగతా రూ.443.07 కోట్లు మురిగిపోయే ప్రమాదం నెలకొంది. ఒకవేళ హామీ మేరకు రూ.112.57 కోట్లు సైతం విడుదల కాకపోతే మొత్తం రూ.555 కోట్లను రాష్ట్రం నష్టపోనుంది.