హైదరాబాద్కు కేంద్ర వైద్య బృందాలు | Bandaru Dattatreya meet JP Nadda | Sakshi
Sakshi News home page

హైదరాబాద్కు కేంద్ర వైద్య బృందాలు

Jan 21 2015 11:18 AM | Updated on Sep 2 2017 8:02 PM

హైదరాబాద్కు కేంద్ర వైద్య బృందాలు

హైదరాబాద్కు కేంద్ర వైద్య బృందాలు

తెలంగాణలో స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బి.దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు.

న్యూఢిల్లీ : తెలంగాణలో స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బి.దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. బుధవారం న్యూఢిల్లీలో జేపీ నడ్డాను దత్తాత్రేయ కలసి...  తెలంగాణ విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూపై నడ్డాకు వివరించారు.

హైదరాబాద్కు కేంద్ర వైద్య బృందాలను పంపాలని దత్తాత్రేయ చేసిన విజ్ఞప్తిపై జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సురేష్ చందా హుటాహుటిన బుధవారం న్యూఢిల్లీ పయనమైయ్యారు. రాష్ట్రంలో కోరలు చాచిన స్వైన్ ఫ్లూపై ఆయన కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement