బాత్రూంలో పడి విద్యార్థి మృతి | a student felt in the bathroom and died | Sakshi
Sakshi News home page

బాత్రూంలో పడి విద్యార్థి మృతి

Feb 28 2015 8:33 PM | Updated on Nov 9 2018 5:02 PM

బాత్రూంలో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం వరంగల్ నగరంలోని శివనగర్‌లో చోటు చేసుకుంది.

వరంగల్: బాత్రూంలో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం వరంగల్ నగరంలోని శివనగర్‌లో చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ పోలీస్టేషన్ సెకండ్ ఎస్సై రవీందర్ అందించిన వివరాల ప్రకారం.. శివనగర్‌కు చెందిన సంపది రాహుల్‌రెడ్డి(19) మహారాష్ట్రలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాడు. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో వరంగల్ శివనగర్‌లోని ఇంటికి శుక్రవారం వచ్చాడు. కుటుంబ సభ్యులందరూ కలిసి రాత్రి సినిమాకు వెళ్లి వచ్చి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారిన తర్వాత చూస్తే రాహుల్‌రెడ్డి బాత్రూంలో పడిపోయి ముక్కునుంచి రక్తం కారుతుండడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఎంజీఎంకు తరలించారు. అప్పటికే రాహుల్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడి తండ్రి రవీందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీందర్ పేర్కొన్నారు.

(కరీమాబాద్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement