8న డీసీసీబీ చైర్మన్ ఎన్నిక | 8th DCCB Chairman Selection | Sakshi
Sakshi News home page

8న డీసీసీబీ చైర్మన్ ఎన్నిక

Sep 30 2014 2:54 AM | Updated on Sep 2 2017 2:07 PM

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ను ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 8న చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారు

 నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ను ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 8న చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 8వ తేదీన ఒక్కరోజే ఎన్నికల ప్రక్రియ మొత్తం చేపట్టాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి ప్రక్రియ మొదలు పెట్టి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిచేయాలని కోరారు. కాగా, ఎన్నికల అధికారిగా జిల్లా సహకార ఆడిట్ అధికారి లక్ష్మీనారాయణను నియమించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీసీసీబీ చైర్మన్ యెడవెల్లి విజయేందర్‌రెడ్డి ఈనెల 15వ తేదీన తన రాజీనామాను కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్‌కు అందజేశారు. చైర్మన్ రాజీనామాను ఆమోదించిన అధికారులు వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు ఇన్‌చార్జ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. డీసీసీబీ పాలకమండలిలో 21మంది డెరైక్టర్లు ఉన్నారు. అక్టోబర్8న జరగబోయే ఓటింగ్‌లో డెరైక్టర్లందరూ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement