తెలంగాణలో కొత్తగా 62 పాజిటివ్‌ కేసులు

62 New Corona Cases Reported In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం 62 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సం ఖ్య 1761కి చేరగా.. మరణాలు 48కి చేరాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 42 మంది, రంగారెడ్డిలో ఒక కేసు నమోదు అవ్వగా.. వలసదారులు 19 మంది ఉన్నారు. మొత్తం కేసుల్లో 118 మంది వలసదారులు ఉన్నారు. ఇక శుక్రవారం ఏడుగురు డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 1,043కి చేరుకుంది. ఆసుపత్రిలో 670 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసింది.

చదవండి: వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top