రాష్ట్రంలోని జిల్లా, ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 20 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా, ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 20 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆసుపత్రి ఆవరణలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం, నీటిని ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అందించిన విద్యుత్కు మాత్రం ప్రైవేటు సంస్థ చెల్లించాలి. ప్రభుత్వం ఒక్కో డయాలసిస్ ప్రక్రియకు చెల్లించే మొత్తం నుంచి ఏ సంస్థ ఎక్కువ మొత్తంలో ఆసుపత్రికి చెల్లించేందుకు టెండర్లో కోట్ చేస్తుందో ఆ సంస్థను ఎంపిక చేస్తారు. ప్రైవేటు సం స్థలతో ఒప్పందం కుదుర్చుకునే బాధ్యతను వైద్య విధాన పరిషత్ కమిషనర్కు, రిమ్స్ సంచాలకుడికి కట్టబెట్టారు.
డయాలసిస్ కేంద్రాలివే..
1) తాండూరు జిల్లా ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా; 2) వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా; 3) సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి, మెదక్; 4) సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, మెదక్; 5) ఏరియా ఆసుపత్రి, మెదక్; 6) మంచిర్యాల ఏరియా ఆసుపత్రి, ఆదిలాబాద్; 7) నిర్మల్ ఏరియా ఆసుపత్రి, ఆదిలాబాద్; 8) రిమ్స్, ఆదిలాబాద్; 9) ఉట్నూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఆదిలాబాద్; 10) నల్లగొండ జిల్లా ఆసుపత్రి; 11) సూర్యాపేట ఏరియా ఆసుపత్రి, నల్లగొండ జిల్లా; 12) భద్రాచలం ఏరియా ఆసుపత్రి, ఖమ్మం జిల్లా; 13) ఏటూరు నాగారం కమ్యూనిటీ హెల్త్సెంటర్, వరంగల్ జిల్లా; 14) మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి, వరంగల్ జిల్లా; 15) కరీంనగర్ జిల్లా ఆసుపత్రి; 16) జగిత్యాల్ ఏరియా ఆసుపత్రి, కరీంనగర్ జిల్లా; 17) గద్వాల్ ఏరియా ఆసుపత్రి, మహబూబ్నగర్ జిల్లా; 18) నాగర్కర్నూల్ ఏరియా ఆసుపత్రి, మహబూబ్నగర్ జిల్లా; 19) వనపర్తి ఏరియా ఆసుపత్రి, మహబూబ్నగర్ జిల్లా; 20) కామారెడ్డి ఏరియా ఆసుపత్రి, నిజామాబాద్ జిల్లా.