-
రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలను రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని కూడా కలుస్తామన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ వైపు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు పోజులు కొడుతూ మరోవైపు దానిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్యనాయకులు శనివారం రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో సుమారు అరగంటసేపు భేటీ అయ్యారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, ప్రొటోకాల్ ఉల్లంఘనపై గవర్నర్కు వినతిపత్రాలు సమరి్పంచి, అందులోని అంశాలను కేటీఆర్, హరీశ్రావు గవర్నర్కు వివరించారు. అనంతరం గవర్నర్తో భేటీ వివరాలను కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. ‘రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్లో చేర్చుకున్నట్లు గవర్నర్కు వివరించాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఓ వైపు న్యాయపోరాటం చేస్తున్నాం. మరోవైపు స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశామనే విషయాన్ని గవర్నర్కు వివరించాం. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు, పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోచేరినా వారిపై చర్యలు లేవనే విషయాన్ని ప్రస్తావించాం. ప్రొటోకాల్ ఉల్లంఘనతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పాం. ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లడం సరికాదనే అభిప్రాయం గవర్నర్ వ్యక్తంచేశారు. ఈ అంశంపై ప్రభుత్వ వివరణ కోరుతూ లేఖ రాస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. విపక్ష పారీ్టగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనను కలవాలని గవర్నర్ చెప్పారు. తన పరిధిలో ఉన్న అంశాల్లో తప్పనిసరిగా న్యాయం చేస్తానన్నారు. నిరుద్యోగుల విషయంలో గవర్నర్ సీరియస్గా స్పందించిన తీరుకు అభినందనలు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ సీరియస్గా స్పందించారు ‘రాష్ట్రంలో యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీల ఉల్లంఘనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామనే హామీని నిలబెట్టుకోలేదు. సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి, కేసులతో భయానక వాతావరణం నెలకొంది. ఈ అంశంపై హోం శాఖ కార్యదర్శిని పిలిచి మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది’అని కేటీఆర్ చెప్పారు. ‘మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకుపోయి కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు గంగపాలైందని భూతద్దంలో చూపుతూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి. కొద్దిరోజుల్లోనే మరమ్మతులు పూర్తయి ప్రస్తుతం మేడిగడ్డ నిండుకుండను తలపిస్తోంది. త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్ల రూపాయల లాభం వస్తుందని సీఎం రేవంత్ చెప్పారని, ఇప్పుడు నాలుగు నెలలపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఆయనకు అందులో వాటా ఎంత వస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. చేసింది చెప్పుకోవడంలోనే ఉంది: గవర్నర్ ప్రస్తుత రాజకీయాల్లో చేసింది చెప్పుకోలేక పోవడంతో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బీఆర్ఎస్ బృందంతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గతంలో తమిళనాడులో కామరాజ్ నాడార్ ప్రభుత్వం అనేక మంచి పనులు చేసినా.. చేసింది చెప్పుకోలేక ఓటమి పాలైన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయాలన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయని, పార్టీ ఫిరాయింపులు సహా ప్రజలు అన్ని అంశాలను నిశితంగా గమనిస్తారని చెప్పినట్లు సమాచారం. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని కితాబునిచ్చినట్లు తెలిసింది. గవర్నర్తో భేటీలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
గవర్నర్ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్పై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం సమావేశమయ్యారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పాల్గొన్నారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులు, పార్టీ ఫిరాయింపుల అంశం, ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.గవర్నర్తో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని గవర్నర్కు వివరించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు తుంగలో తొక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులపై కేసులు, దాడులు జరుగుతున్నాయని.. హైదరాబాద్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. మొదటి సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే లేదని అన్నారు. గతంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవని తెలిపారు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకొచ్చి అరెస్టులు చేశారన్నారు.‘రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఖననంపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం. పార్టీ ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేశాం. భయపెట్టి పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తేదీలతో సహా గవర్నర్కు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశాం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని వివరించాం. ఈ రెండు అంశాలపై గవర్నర్కు సుదీర్ఘంగా మా అభ్యర్థన వినిపించాం. హోమ్ శాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలిపారు. ఎమ్మెల్యేలపై ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరుగుతుంది. మాలో ఎవరికి కూడా నియోజకవర్గాల్లో గౌరవం దక్కడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలుస్తాం. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయంపై వివరిస్తాం. కాళేశ్వరంలో జరిగిన చిన్నతప్పి దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను సందర్శిస్తాం’ అని తెలిపారు -
కాంగ్రెస్కు ఐదేళ్లూ పట్టదు: కిషన్ రెడ్డి సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ బుద్ధి చెప్పడానికివ పదేళ్ల కాలం పట్టింది కానీ, కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి కనీసం ఐదేళ్లు కూడా పట్టదు అంటూ విమర్శలు చేశారు.కాగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం నిరుద్యోగుల మహాధర్నాలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత ఆత్మబలిదానం చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించింది. గత బీఆర్ఎస్ యువత ఆశలను నట్టేట ముంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యూత్ డిక్లరేషన్తో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక, రేవంత్ సభల్లో రెండు లక్షల ఉద్యోగాలు అంటూ ఉదరగొట్టారు. రుణమాఫీ కూడా రైతులను మభ్య పెట్టేలా చేశారు. ఇచ్చిన హామీ ప్రకరం అందరికీ చేయాలి కానీ.. కొంతమందికే రుణమాఫీ చేసి పాలాభిషేకం చేయించుకుంటున్నారు.జాబ్ కాలెండర్ ఎటు పోయింది రేవంత్ రెడ్డి?. 18 ఏళ్లు నిండిన కాలేజీ అమ్మాయిలకు స్కూటీ అన్నారు మర్చిపోయారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని నట్టెట ముంచారు. ప్రజాపాలనలో సెక్రటేరియట్లోకి సామాన్యులకు ఎంట్రీ లేదు. కాంగ్రెస్ పైరవీకారులకు మాత్రమే ఉంది. విద్యా భరోసా కార్డులు ఎటు పోయాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయి. కేసీఆర్కి బుద్ది చెప్పడానికి పదేళ్లు పట్టింది కానీ, కాంగ్రెస్కు బుద్ది చెప్పడానికి కనీసం ఐదేళ్లు కూడా పట్టదు.చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకెళ్ళి రేవంత్ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది తెలంగాణ పరిస్థితి. కేసీఆర్ పోయి రేవంత్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ కాంగ్రెస్కు, రేవంత్కు లాభం జరిగింది. నిజమైన మార్పు రాష్ట్రంలో రాలేదు. వచ్చిన మార్పు కేసీఆర్ కుటుంబం పోయి సోనియా కుటుంబం వచ్చింది. గులాబీ జెండా పోయి చెయ్యి గుర్తు జెండా వచ్చింది. ప్రజలను దోపిడీ చేసే స్వేచ్చ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. బీఆర్ఎస్ చేసినట్లే కాంగ్రెస్ చేస్తుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులు కాంగ్రెస్ చేస్తోంది. అవినీతి పాలనలో, దోపిడీలో, ఫిరాయింపుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుంది. బీజేవైం ద్వారా మా పోరాటాలు యువత కోసం కొనసాగుతాయి అంటూ కామెంట్స్ చేశారు. -
రుణమాఫీలో మాది ఆల్ టైం రికార్డ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో పాలనలో తెలంగాణలో వ్యవసాయ రంగం స్వర్ణయుగం సాధించడంతోపాటు రుణమాఫీలో రైతులకు రూ.1.20లక్షల కోట్లు లబ్ధి చేకూర్చి దేశంలోనే ఆల్ టైం రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం హరీశ్రావు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన లబ్ధిని వివరించారు.కేసీఆర్ పాలనలో వివిధ పథకాల కింద రైతులకు రూ.1.20 లక్షల కోట్లు నేరుగా సాయం అందించిందన్నారు. రైతుబంధు కింద 69 లక్షల మంది రైతులకు రూ.72,972 కోట్లు, రైతు బీమా కింద 1.11 లక్షల మంది రైతులకు రూ.6,488 కోట్ల తమ ప్రభుత్వ హయాంలో చెల్లించామన్నారు. రైతు రుణమాఫీ కింద రెండు విడతల్లో కలుపుకుని రూ.29,144.61 కోట్లు చెల్లించామన్నారు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రైతులకు రూ.11,401 కోట్లు సాయం అందించామన్నారు. చిరుద్యోగుల వెతలు తీర్చండి ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వారికి వేతనాలివ్వాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రతీ నెలా 1న వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. -
ఊరించి.. కంటతడి పెట్టించారు!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై రైతులను ఏడు నెలలుగా ఊరించి, చివరకు కంటతడి పెట్టించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ‘చారాణ కోడికి.. బారాణా మసాలా’అనే సామెతను తలపించేలా రుణమాఫీపై ప్రభుత్వం తీరు ఉందన్నారు. అర్హత ఉన్నా అనేక మంది రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదో చెప్పే నాథుడు లేడని, రైతుల గోడు వినేవారే లేరని అన్నారు. రుణమాఫీ జరగని అర్హులైన రైతులు ఓ వైపు ఆందోళనలో ఉంటే, సంబురాలు ఎందుకని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.40 లక్షల మంది లబ్ధిదారుల్లో 30 లక్షల మంది రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు వ్యవసాయ సీజన్లు కావస్తున్నా రైతు భరోసాను ప్రారంభించలేదన్నారు. రైతు భరోసా, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు వంటి హామీలను అమలు చేయకుండా మభ్య పెడుతోందన్నారు. ఇంతకాలం ప్రజల దృష్టిని మళ్లించిన రేవంత్ ప్రభుత్వం, ప్రస్తుతం నిధుల దారిమళ్లింపునకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు.పేదరిక నిర్మూలనలో రెండో స్థానంకేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టడంతో పేదరిక నిర్మూలనలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని కేటీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) లెక్కలే దీనికి నిదర్శనమన్నారు. పదేళ్లపాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు.2020–21తో పోలిస్తే 2023–24 (ఎస్డీజీ)లో 74 స్కోర్తో తెలంగాణ ముందుందని చెప్పారు. అంతకుముదు 2020 –21తో పోలిస్తే ఐదు పాయింట్లు మెరుగైందన్నా రు. చాలారంగాల్లో తెలంగాణ సాధించిన మా ర్కులు జాతీయ సగటును మించి ఉండటం గత పదేళ్ల అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ ఫిరాయింపులపై పెట్టే దృష్టి.. రాష్ట్రాభివృద్ధిపై పెడితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. -
తప్పుడు ప్రచారం మానుకోండి.. బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారని కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. ఇప్పటికైనా రైతుల్లో అయోమయం సృష్టించడం మానేసి మా నుంచి మీరు నేర్చుకోంది. మీరు చేయలేని పనులు మేము చేస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మా పార్టీ సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హౌసింగ్ జీవోపైనా ఇష్టానుసారం మాట్లాడారు’ అంటూ సీరియస్ అయ్యారు.ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నెర్రెలు వాచిన కథ మనం చూశాం. మళ్లీ కుంగుతున్నట్టు ప్రజలు చెబితేనే మాకు తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరంపై విచారణ కమిషన్ పనిచేస్తోంది. మిగతా ఇంకా ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
చిరుకు జగ్గారెడ్డి చురకలు
హైదరాబాద్, సాక్షి: రైతులకు నష్టం జరుగుతుందని పలు సినిమాలు తీసిన చిరంజీవి... ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నాడని ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రుణమాఫీ హామీ నెరవేర్చిన తరుణంలో ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై, అలాగే నటుడు చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో రుణమాఫీ పైసలతో ఫోన్లు అన్ని టింగు టింగుమంటుంన్నాయి. ఆగస్టు 15 లోపు 2 లక్షల మాఫీ అయిపోతుంది. దీనికి సాక్ష్యం రైతులే. ఫోన్ లలో మెసేజ్ లు చూసి రైతు ల ఇళ్ళలో సంబరాలు జరుగుతున్నాయి. కానీ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్రలేదు. కేటీఆర్ ట్విట్టర్ కే పనికొస్తడు.. పనికి పనికిరాడు. మా ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉన్నా.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చాం... ఇప్పటిదాకా బీజేపీ ఎన్నివేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది? దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటోళ్లకు రూ.16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది. కానీ, ఒక్క రైతుకైనా చేసిందా?. గతంలో.. దేశం మొత్తం 71 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే చెల్లింది. .. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో ధర్నా చేసిన వారికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?. పవన్ కల్యాణ్కు, బీజేపీ వాళ్లకే ఎందుకు మద్దతు ఇస్తున్నారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు(చిరును ఉద్దేశించి..) రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు?. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, మోదీకి మద్దతు ఇస్తున్నారు!. రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్కు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు. కాంగ్రెస్లో ఉంటే చిరంజీవి సరైన దారి లో ఉండేవాడు. ఇప్పుడు పక్కదారి పట్టాడు అని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు... బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులే. కేసీఆర్ గత పదేళ్ళలో రూ.7 లక్షల కోట్ల ఆప్పులు చేసి రైతులకు ఇచ్చింది 26 వేల కోట్ల రూపాయలే. కాంగ్రెస్ గత 6 నెలల్లో రైతులకు ఇచ్చింది రూ. 31 వేల కోట్లు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ఖూనీ చేసింది. అటు కేంద్రంలో బీజేపీ నల్ల చట్టాలతో రైతులను మర్డర్ చేసింది. కేంద్ర మంత్రుల కొడుకులు రైతు ల మీద నుంచి బండ్లు ఎక్కించారు అని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. -
‘చారాణ కోడికి.. బారాణ మసాలా..!’ రైతు రుణమాఫీపై కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు మరోసారి విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని విమర్శలు గుప్పించారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక ఆందోళనలో ఉంటే.. ప్రభుత్వం ఎందుకీ సంబరాలు జరుపుతోందని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ? లేక ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా? అని నిలదీశౠరు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు‘సీఎం రేవంత్ రెడ్డి గారు...ఊరించి.. ఊరించి..ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలైనై..!!అన్నివిధాలా అర్హత ఉన్నా..ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు...రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు...అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక..అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు ?నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ?ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ?రెండు సీజన్లు అయినా..రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేజూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే..!!కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!రైతు కూలీలకు.. రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!మభ్యపెట్టే మీ పాలన గురించి..ఒక్క మాటలో చెప్పాలంటే..ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..!ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!!జై తెలంగాణ’సీఎం గారు...ఊరించి.. ఊరించి..ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!రైతుమాఫీ…— KTR (@KTRBRS) July 19, 2024 -
పావు వంతు రైతులే అర్హులా?
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ పేరిట రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం రైతాంగాన్ని మరో మారు మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతుబంధు కింద జూన్లో రైతులకు ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి రూ.7 వేల కోట్లను రుణమాఫీ కోసం దారి మళ్లించిందని కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంత మొత్తాన్ని విదిల్చి రుణమాఫీ చేస్తున్నట్లుగా పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. 40 లక్షల మంది రైతులు లక్ష రూపాయల రుణం తీసుకుంటే 11 లక్షల మందిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులే అర్హత సాధించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2014లోనే రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు రూ. 16,144 కోట్లు వెచి్చంచి.. సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుపై పోలీసు సి బ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయా లని కేటీఆర్ ‘ఎక్స్’లో కోరారు. ఓ వాహనదారుడిని పోలీసులు దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని ప్రస్తావిస్తూ దీన్ని పోస్ట్ చేశారు. పౌరుడిపై పోలీసులు వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పోలీసు శాఖ, డీజీపీకి ఇది అంగీకారయోగ్యమైన భాషేనా అని ప్రశ్నించారు. -
సీఎం రేవంత్కు హరీష్ రావు కౌంటర్.. రాజీనామా లేఖలో..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ సందర్భంగా రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తే హారీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.మరోవైపు.. సీఎం రేవంత్ కూడా రుణమాఫీ ముందుగానే చేశాం.. కానీ, సవాల్ మేరకు ఎవరూ రాజీనామా చేయాల్సిన పనిలేదని అన్నారు. దీంతో, ఈ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాను ఏం మాట్లాడానో ఒక్కసారి చూడాలని మాజీ మంత్రి హారీష్ రావు.. కాంగ్రెస్ నేతలకు చూపించారు. తన రాజీనామా లేఖలో కూడా ఏం ఉందో చూడాలని కౌంటరిచ్చారు.సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చారు.. ‘సీఎం రేవంత్ రెడ్డి గారూ!తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది.👉పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది.👉నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను.మరోసారి చెబుతున్నా, ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?’ అంటూ కామెంట్స్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి గారూ!తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. 👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన… pic.twitter.com/mghX3v2TES— Harish Rao Thanneeru (@BRSHarish) July 18, 2024 -
రైతు రుణమాఫీ.. కాంగ్రెస్ సంబురాలు దేనికి?: బండి సంజయ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తూ వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రైతులతో కలిసి సంబురాలు చేసుకుంటున్నాయి. కాగా, కాంగ్రెస్ సంబురాలపై బీజేపీ ఎంపీ సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.రైతుల రుణమాఫీపై బండి సంజయ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘ఏం సాధించారని కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకుంటుంటోంది. రబీ, ఖరీఫ్లో రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుకా? నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా?’ అని నిలదీశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రుణమాఫీ డ్రామా ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. తెలంగాణలో లక్ష వరకు రుణాలు ఉన్న రైతులకు ఈరోజులు రుణమాఫీ జరిగింది. వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మరో విడతల్లో రూ.రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. -
తెలంగాణలో ‘జంపింగ్స్’ గేమ్.. తిలాపాపం తలా పిడికెడు!
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో ప్రచారంలోకి వచ్చింది. అది ఏమిటంటే మాజీ మంత్రులు , బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ , హరీష్ రావులు ప్రస్తుతం జరుగుతున్న ఫిరాయింపులపై తీవ్రంగా చేస్తున్న విమర్శలు ఒకవైపు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు ఫిరాయింపులను సమర్ధిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకోవైపు ఉన్నాయి. ఫిరాయింపు రాజకీయాల విషయంలో ఒకరినే తప్పుపట్టే పరిస్థితి లేదు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా రాజకీయ నేతలు దాదాపు అందరూ ఈ దిక్కుమాలిన రాజకీయానికి పాల్పడుతున్నారు. కొన్నిసార్లు తమ పార్టీని రక్షించుకోవడానికి అయితే, మరికొన్నిసార్లు ఎదుటి పార్టీని దెబ్బతీసేందుకు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరిని ఉద్దేశించి కేటీఆర్ ఒక మాట అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీని వీడి కేశవరావు, కడియం శ్రీహరి వంటివారు వెళ్లారని, పార్టీని వీడడం అంటే తల్లికి ద్రోహం చేసినట్లే అని అన్నారు. వీరిపై స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. సుప్రింకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి ఫిరాయింపుదారులపై అనర్హత ఓటు వేయాలని డిమాండ్ చేశారు. అలాగే హరీష్ రావు కూడా ఘాటైన విమర్శలు చేశారు. గతంలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని, అయినా పార్టీకి ఏమీ కాలేదని కూడా ఆయన చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ వ్యతిరేకులు గతంలో శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ అన్న వ్యాఖ్యల వీడియోని జవాబుగా చూపుతున్నారు. అందులో ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ ,ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు వస్తున్నారంటే అది తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతోందని ఆయన ఎద్దేవ చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా!బండ్లు ఓడలు అవుతాయి..ఓడలు బండ్లు అవుతాయి అన్న చందంగా తెలంగాణలో బీఆర్ఎస్ అదికారం కోల్పోవడం, కాంగ్రెస్ పవర్ లోకి రావడం జరిగిపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేమ్ మొదలైంది. ఈ గేమ్ లో కాంగ్రెస్ పక్షాన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీజేపీ తో పొత్తులో ఉన్న టీడీపీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ కు తోడ్పడుతున్నారా అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రకాష్ గౌడ్,అరికపూడి గాంధీలు కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ముందుగా చంద్రబాబును కలవడం. దాంతో ఆయన సూచన మేరకే వీరు పార్టీ మారారేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీరు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ ను వదలి విజయవాడ వెళ్లిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకున్నారు. 2014 లో పదిహేను మంది టీడీపీ పక్షాన ఎన్నికైతే ముగ్గురు తప్ప మిగిలిన పన్నెండు మంది అప్పటి టీఆర్ఎస్ లో చేరి పోయారు. ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో బీఆర్ఎస్ లో టీడీపీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసినట్లు ప్రకటించేశారు.అప్పట్లో వీరిపై రేవంత్ రెడ్డి పోరాడారు.సుప్రింకోర్టువరకు వెళ్లే యత్నం చేశారు. సరిగ్గా ఇప్పుడు అదే పనిలో కేటీఆర్,హరీష్ రావులు ఉండడం విశేషం. ఆ తర్వాత కాలంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు.విశేషం ఏమిటంటే 2014 లో కాంగ్రెస్ పక్షాన గెలిచిన 21 మందిలో మెజార్టీ సభ్యులు టీఆర్ఎస్ లో చేరిపోయారు. తదుపరి 2018 లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మంది గెలిస్తే పన్నెండు మంది టీఆర్ఎస్లో విలీనం అయిపోయారు. ఈ రకంగా తనకు ఎదురులేని పరిస్థితిని కేసీఆర్ సృష్టించుకున్నారు. ఆ తర్వాత పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకున్నారు. ఆ పేరుతోనే 2023 ఎన్నికలలో పోటీచేసి కాంగ్రెస్ చేతిలో చతికిల పడ్డారు. పీసీసీ అద్యక్షుడుగా పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో కేసీఆర్ గేమ్ ముగిసి రేవంత్ ఆట ఆరంభం అయింది. బీఆర్ఎస్ ను ఖాళీ చేయించే పని పెట్టుకున్నారు. కేసీఆర్ మాదిరే ఈయన కూడా ఈ వ్యవహారాన్ని సమర్ధించుకుంటున్నారు.తమ ప్రభుత్వ అభివృద్దిని చూసి ఎమ్మెల్యేలు చేరుతున్నారని చెబుతున్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే తాము చూస్తూ ఊరుకుంటామా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో కేటీఆర్,హరీష్ రావు ఎంత గొడవ చేసినా, ఎన్ని విమర్శలు చేసినా వారికి నైతికంగా ఫిరాయింపులపై విమర్శ చేసే హక్కు కోల్పోయారు. బహుశా ఈ నేపద్యంలోనే కేసీఆర్ ఫిరాయింపులను విమర్శిస్తూ బహిరంగంగా మాట్లాడుతున్నట్లు అనిపించడం లేదు.కాకపోతే తన ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను పిలిపించుకుని మాట్లాడి బుజ్జగింపు యత్నాలు చేస్తున్నారు. మళ్లీ అధికారం వచ్చే అవకాశం ఉందని ఆయన విశ్వాసం పాదుకొలిపే యత్నం చేస్తున్నారు. తెలంగాణలో వచ్చిన చిక్కు ఏమిటంటే కాంగ్రెస్ తో పాటు,బీజేపీ , బీఆర్ఎస్ లు కూడా అధికారం కోసం పోటీ పడుతుండడం, ముక్కోణపు రాజకీయం అవడం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. అదే బీజేపీ కనుక బాగా బలహీనంగా ఉన్నట్లయితే బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానప్రతిపక్షంగా పోటాపోటీగా ఉండేది. కాని ఆశ్చర్యంగాబీజేపీ గత లోక్ సభ ఎన్నికలలో పుంజుకుని కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది సీట్లు గెలుచుకుంది.దాంతోబీజేపీ కూడా వచ్చే శాసనసభ ఎన్నికల నాటి బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికైతే బీజేపీ బదులు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అందువల్లే పది మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. వారిలో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీలు టీడీపీలో కూడా సీనియర్ నేతలుగా ఉండేవారు.తదుపరి టీఆర్ఎస్ లో చేరారు. అక్కడ అధికారం చవిచూసిన వీరు మళ్లీ అధికార పక్షమైన కాంగ్రెస్ లో ప్రవేశించారు. వారంతా కాంగ్రెస్ లో చేరడం వల్ల రేవంత్ కు మరింత బలం వస్తుందని చెప్పవచ్చు.ఇక దానం నాగేందర్,కాలె యాదయ్యలు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో అటు దూకారు. తిరిగి కాంగ్రెస్ పవర్ను సాధించడంతో వారు మళ్లీ ఇందులోకి దూకేశారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారం ఎటు ఉంటే అటు చేరడానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇష్టపడుతున్నారు. అధికారంలో లేకపోతే నియోజకవర్గాలలో అసలు పనులు జరగవని, చివరికి పోలీస్ స్టేషన్లలో తమ మాట వినరని భయపడుతున్నారు. ఇతరత్రా ప్రభుత్వంతో ఉండే లావాదేవీల రీత్యా అధికారపార్టీలోకి వెళ్లడం మామూలు అయిపోయింది. దానం నాగేందర్ ది ఆసక్తికరమైన స్టోరీ అని చెప్పాలి. 1994లో టీడీపీ వేవ్ లో కాంగ్రెస్ పక్షాన అసిఫ్ నగర్ నుంచి గెలిచారు. 1999లో కూడా ఆయన గెలుపొందారు. కాని 2004లో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపీగా పోటీచేయాలని సూచిస్తే,తిరస్కరించి రాత్రికి రాత్రే టీడీపీలో చేరిపోయారు. మళ్లీ గెలవగలిగారు. కాని టీడీపీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ గెలిచింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎతో ఉన్న సంబందాల రీత్యా ఆయన వెంటనే పార్టీ మారిపోయారు. పద్దతి ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాని ఉప ఎన్నికలో ఓటమి చవిచూడడం ఆయనకు ఎదురుదెబ్బ అయింది. 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచారు. 2014 వరకు మంత్రిగా కూడాఉన్నారు. 2014 ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత ఆయన చూపు బీఆర్ఎస్ వైపు మళ్లింది. ఎలాగైతేనేమి ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నా బీఆర్ఎస్ సీటు సంపాదించి 2018లో గెలుపొందారు. అలాగే 2023 లో సైతం విజయం సాధించారు. ఆయన ఈసారి గెలిచినా బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. దాంతో అధికారంలో ఉన్న కాగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఈ విడత పదవికి రాజీనామా చేయకపోగా, కాంగ్రెస్ పార్టీ పక్షాన లోక్ సభకు పోటీచేసి ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక అంశాన్ని పెట్టినా, దానిని పాటించడం లేదు.ఇంకో సంగతి ఏమిటంటే దానం నాగేందర్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు భూ కబ్జా ఆరోపణలు చేస్తుండేవారు. ఆయన కాంగ్రెస్ లో చేరడంతో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారన్నమాట. ఆయన ఒక్కరనే కాదు. ఇలా పార్టీ మారే ఎమ్మెల్యేలందరికి వారి,వారి కారణాలు ఉంటాయి. టీఆర్ఎస్ నుంచి మరో ఇరవైమందిని లాగితే బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ ఎలాగైతే గతంలో విలీనం చేసుకుందో ,అదే రీతిలో బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా రేవంత్ పావులు కదుపుతున్నారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావునుకూడా కాంగ్రెస్ లోకి ఆకర్షించినా, ఆయన పదవికి రాజీనామా చేసి రావడం మంచిదే. ఇప్పుడు ఆ సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగడం అంటే రకరకాల వ్యూహాలు ఉండవచ్చు. కొందరికి కాంట్రాక్టులు ఇవ్వవచ్చు. మరికొందరికి ప్యాకేజీలు ఉండవచ్చు.ఇంకొందరు నియోజకవర్గంలో పనులు,ఆదిపత్యం కోసం వెళ్లవచ్చు. రాజకీయాలలో వచ్చిన కొత్త ట్రెండ్ ఏమిటంటే విపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కన్నా, ఎన్నికలలో పోటీచేసి ఓటమిచెందిన అధికార పార్టీ నేతే పవర్ పుల్ గా ఉండడం. ఆయన ఏమి చెబితే దానినే అధికారులు పాటిస్తూ ఉంటారు. పేరుకు ఎమ్మెల్యేనే కాని ఆయన చెబితే పెద్దగా పనులు జరగవు. దీని దృష్ట్యా కూడా విపక్ష ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ కి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరెవరూ ఫిరాయింపుల వైపు చూడడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండడమే కారణం కావచ్చు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బాగా బలపడితే మాత్రం ఫిరాయింపుల పర్వం కొత్త అంకంలోకి వెళుతుంది. అలాకాకుండా బీఆర్ఎస్ పుంజుకుని శాసనసభ ఎన్నికలలో విజయావకాశాలు ఉన్నాయని జనం భావించే పరిస్థితి ఏర్పడితే ,అప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్లీ ఇటువైపు దూకవచ్చు. ఈలోగానే బీఆర్ఎస్ ను సాద్యమైనంతగా వీక్ చేయాలన్నది రేవంత్ ఆలోచన అన్నది వేరే చెప్పనవసరం లేదు.ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ,తెలుగుదేశంల మద్యే ప్రధాన పోటీ ఉండేది. ఏదో ఒక పార్టీ ప్రతిపక్షంగా గట్టిగా పోరాడగలిగేది. టీఆర్ఎస్ ఈ రెండిటిలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని రెండు ఎన్నికలలో పోటీచేసింది. 2014 నుంచి సొంతంగానే పోటీచేస్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా గణనీయంగా పుంజుకోవడంతో బీఆర్ఎస్కు చిక్కులు వస్తున్నాయి. వీటిని అధిగమించగలిగి బీఆర్ఎస్ పోరాటాలు చేయగలిగితే తెలంగాణ రాజకీయాలలో ప్రజల శక్తిగా ఉండి మళ్లీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలా జరుగుతుందా?లేదా? అన్నది తేలడానికి మరో రెండు,మూడేళ్లు పట్టవచ్చు. అధికారం లేనప్పుడు మొహం చాటేసే నేతలు కూడా గణనీయంగానే ఉంటారు. అదేమి ఊహించనిది కాదు. బీఆర్ఎస్ ఇప్పుడున్న రాజకీయాలలో వీలైనంతవరకు ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే మంచిదే. అలా నిలబెట్టుకోలేకపోతే కేసీఆర్ గతంలో చెప్పిన సూత్రం ప్రకారం అది ఆయన తప్పే అవుతుంది. ఫిరాయింపులపై ఏమి మాట్లాడినా అది వారికే తగులుతుంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం ప్రజలను నమ్ముకుని స్పష్టమైన విధానాలతో ముందుకు వెళ్లడం తప్ప గత్యంతరం లేదు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం: హరీశ్రావు
రామచంద్రాపురం (పటాన్చెరు): పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని భారతీనగర్ కార్పొరేటర్ సింధు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు తాము నిద్రపోమన్నారు. ఆ ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పారీ్టకి నష్టం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న వాళ్లు ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయారన్నారు. గతంలో పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఇప్పుడు ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో కేసు వేశామని తెలిపారు. దీనిపై త్వరలో సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడతామన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా అందుకు కార్య కర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రేషన్కార్డు ఆధారంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఉంటే, తాజాగా సీఎం రేవంత్రెడ్డి పాస్బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటగా చెబుతున్నారన్నారు. ఆయన చెప్పిన మా టలనే జీవోగా తెచ్చి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి రావ డం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఐదేళ్లకు మించి ఏ రాష్ట్రంలో అధికారంలో లేద న్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో కి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.హరీశ్.. టీఆర్ఎస్ టీఆర్ఎస్ కండువాతో మాజీమంత్రి హరీశ్రావు సందడి చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ కండువాతో హరీశ్ కనిపించడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉందా? అని స్థానిక కార్యకర్తలు, స్థానికులు చర్చించుకుంటున్నారు. -
కాంగ్రెస్ నేతల వల్లే కిష్టయ్య ఆత్మహత్యాయత్నం: హరీష్ రావు ఫైర్
సాక్షి, గజ్వేల్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నాయకులకు ఇష్టారాజ్యంగా రైతులపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.కాగా, కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో సిద్దిపేట జిల్లాలో భూమి కోల్పోయిన కిష్టయ్య అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రాణాపాయ స్థితిలో గజ్వేల్ ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిష్టయ్య, ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ..‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను, రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా పేదరైతుల భూముల మీద దాడులు చేస్తున్నారు. రైతులపై విపరీతమైన అక్రమాలు, దౌర్జన్యాలు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోయాయి.ఇలాంటి ఒక సంఘటనే సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామంలో కూడా జరిగింది. బండి కిష్టయ్య అనే పేద రైతు తన భూమి హద్దులు చూపించాలని సర్వే కోసం అప్లై చేస్తే అక్కడికి వచ్చిన డీఐ సర్వే చేసి సరిహద్దులు పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు అందరి ముందే సదరు అధికారికి ఫోన్ చేసి వారిపై ఒత్తిడి తెచ్చి రెండోసారి సర్వే చేయించారు. రెండోసారి సర్వే చేస్తే హద్దులన్నీ మార్చేసి ఆ రైతు పొలానికి దారి లేకుండా చేశారు. రైతును తీవ్ర ఇబ్బందులు పెట్టారు.ఈ క్రమంలోనే రైతు నుంచి 20 లక్షల రూపాయలు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో రైతుపై కేసు పెట్టి వేధించి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో, ఆందోళనకు గురైన కిష్టయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతు కుటుంబంతో మాట్లాడినప్పుడు వారిని 20 లక్షల రూపాయలు అడిగారని చెప్తున్నారు. కాంగ్రెస్ పెద్దల అండదండలు మాకు ఉన్నాయని, మీరు ఎక్కడికి వెళ్లినా మీకు న్యాయం జరగదు అని బెదిరించారని చెప్పుకొచ్చారు.కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యం, విపరీత చర్యల వల్ల అధికారులపై ఒత్తిడి తెచ్చి రైతు భూమి హద్దులు మార్చడం వల్ల కిష్టయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. అడిషనల్ కలెక్టర్ స్థాయిలో విచారణ జరిపించాలని హద్దులు మార్చిన డీఐపై చర్యలు తీసుకోవాలి. అలాగే, అధికారులపై ఒత్తిడి తెచ్చిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ ఈ ఘటనపై దృష్టి పెట్టాలని, ఇలాంటి దురదృష్టకర ఘటనలు రాష్ట్రంలో జరగకుండా చూడాలని, కిష్టయ్యకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి రైతు భూమిని వారికి దక్కే విధంగా రెవెన్యూ శాఖ మంత్రి, ముఖ్య మంత్రి చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్స్ చేశారు. -
రుణమాఫీ చేస్తున్నాం.. హరీష్ రాజీనామాకు సిద్ధమా?: సీఎం రేవంత్
Updates..టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..👉ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పిన దాని కంటే ముందే చేస్తున్నాం. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్తే ఇది అసాధ్యం అని చాలామంది మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమని నిరూపించాం. 👉60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు. సోనియా గాంధీ కుటుంబం గౌరవం కాపాడాలి. దేశానికి ఆదర్శ పాలన మనం ఎందుకు చేయకూడదు.👉వ్యవసాయం దండుగ కాదు పండుగ. రైతులకు రుణమాఫీ చేయడం నా జీవితంలో మర్చిపోలేనిది. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో ముడిపడి ఉంది. రేపు సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బు పడుతుంది. ఆగస్టు 15వ తేదీ లోపల మరో లక్ష రూపాయలు వేస్తాం అని చెప్పుకొచ్చారు. 👉రుణమాఫీపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలి. పార్లమెంటు సభ్యులు రుణమాఫీపై నేషనల్ మీడియాలో చెప్పాలి. భారతదేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేసింది. రుణమాఫీ మోదీ హామీ కాదు. ఇది రాహుల్ గాంధీ హామీ. దివంగత మహానేత వైఎస్సార్ ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అలాగే, రుణమాఫీ గురించి కూడా 20 ఏళ్లపాటు చెప్పుకోవాలి.👉విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు, వేల కోట్ల అప్పులు ఉన్నవాళ్లకి కూడా ఏం కాదు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పడానికే రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం. దీనిపై గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలి. ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళాం. ఇపుడు రుణమాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్.. 👉‘ఆగస్టు దాటకుండానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అమలుకు నిద్రలేని రాత్రులు గడిపాం. అర్హులైన అందరికీ రైతు రుణమాఫీ చేస్తాం. రూ.7లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టినప్పటికీ రూ.2లక్షల రుణమాఫీని నెలల వ్యవధిలోనే అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాం. రేషన్కార్డులు లేని ఆరు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నాం. అయితే, అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదు. 👉 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. 👉 కాగా, రేపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. 👉 కాసేపట్లో ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగనుంది.👉పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. 👉ఇక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది.👉ప్రజాభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ గాంధీభవన్ నుంచి నేతలందరికీ సమాచారం పంపారు.👉మరోవైపు ఈరోజు భేటీలో ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నేతల మధ్య సమన్వయంపై చర్చ జరుగనుంది. అలాగే, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్పై పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.👉ఈ సమావేశంలో రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ హామీ అమలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చిస్తారు.👉అలాగే, రుణమాఫీ సందర్భంగా రైతుల సమక్షంలో నిర్వహించాల్సిన సంబురాలకు సంబంధించిన కార్యాచరణ గురించి సమావేశం పిలుపునిస్తుందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.👉ఇటీవలి రాజకీయ పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రైతు భరోసా అమలు, విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో సుప్రీం ఆదేశాల పర్యవసానాలు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. -
పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. మాజీలు అయ్యేవరకు నిద్రపోం : హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. మాజీలు అయ్యేవరకు నిద్రపోమని మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పటాన్చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతాం. పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. 2001లో తెలంగాణ ఉద్యమం పిడికెడు మందితో ప్రారంభం అయ్యింది. కేసీఆర్ ఒక్కడే 14 ఏళ్ళు పోరాడి రాదని అనుకున్న తెలంగాణని తెచ్చి చూపించారు. అలా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా రానున్న రోజుల్లో మనదే అధికారం’’ అంటూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.మహిపాల్ను తల్లిలా అక్కున చేర్చుకునిపార్టీ మారిన మహిపాల్ రెడ్డిపై హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ తల్లిలా అక్కున చేర్చుకుంది.మూడు సార్లు ఎమ్మెల్యేని చేసింది. బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని పార్టీ మారారు..? ఫిరాయింపులకు పాల్పడేందుకు ఆయనకి మనసు ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. గూడెం (గూడెం మహిపాల్ రెడ్డి) పోయినా గుండె ధైర్యం కోల్పోవద్దని అన్నారు హరీష్ రావు.రుణమాఫీకిరేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని అన్నారు. ఇప్పుడు ఆయనే కండువా కప్పుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రుణమాఫీలో కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డ్ ఆధారంగా రుణమాఫీ చేస్తాం అని జీవోలో ఉంది..నోటితో మాత్రం రేషన్ కార్డుతో సంబంధం లేదని అంటున్నారు. నోటితో వచ్చిన మాటని జీవోలో పెట్టినప్పుడే మేం నమ్ముతామని పునరుద్ఘాటించారు. పీఎం కిసాన్ నిబంధనలు ఎందుకు..? రేషన్ కార్డు నిబంధనలు ఎందుకు..? అని అడిగారు.అధికారంలో వచ్చేది బీఆర్ఏస్సే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఐదేళ్లకు మించి అధికారంలో లేదు. ఆరునూరైనా మళ్ళీ అధికారంలో వచ్చేది బీఆర్ఏస్సే. కొద్దీ రోజులైతే కాంగ్రెస్ వాళ్లు గ్రామాల్లో తిరగని పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో బస్సు తప్ప అన్ని తుస్సేనని హరీష్ రావు ఎద్దేశా చేశారు. -
స్పీకర్ వేటు వేయకుంటే సుప్రీంకు..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడతామని ఢిల్లీలో పోజులు కొడుతున్న కాంగ్రెస్ పార్టీ .. రాష్ట్రంలో మాత్రం దానిని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్తో భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై గగ్గోలు పెడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే పదవిని కోల్పోయేలా రాజ్యాంగాన్ని సవరించాలన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ను తప్పుదోవ పట్టిస్తున్నారు కర్ణాటకలో ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీ రూ.50 కోట్ల చొప్పున కొనుగోలు చేస్తోందని అక్కడి సీఎం సిద్దరామయ్య ఆరోపించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో చూడాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ను కోరినట్లు తెలిపారు. హర్యానా, హిమాచల్ప్రదేశ్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు అక్కడి స్పీకర్లు అనర్హత వేటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర స్పీకర్ను ప్రభుత్వంతో పాటు కొందరు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకున్నా ఎలాంటి కళంకం రాదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని, వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు సీఎం రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారకుంటే ప్రాణహాని పేరిట బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను డీఎస్పీ స్థాయి అధికారులు బెదిరించారని చెప్పారు. బీజేపీని వాషింగ్ మెషీన్ పారీ్టగా విమర్శించిన కాంగ్రెస్ తెలంగాణలో అదే పని చేస్తోందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి ఆస్తులు, భవనాలపై ప్రభుత్వ సంస్థలతో దాడులు చేయిస్తోందని చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేల వ్యాపారాలపై విజిలెన్స్ విభాగాన్ని, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారిపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. స్పీకర్తో భేటీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ప్రసాద్కుమార్ను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కోరింది. ఈ మేరకు వేర్వేరుగా లేఖలు అందజేసింది. కేటీఆర్ నేతృత్వంలో 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. కాగా నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు. -
ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వíహిస్తున్న నియోజకవర్గాల్లో తమపై ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం స్పీకర్ ప్రసాద్కుమార్తో భేటీ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆరునెలలుగా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ తనపై పోటీచేసి ఓడిన కాంగ్రెస్ అభ్యరి్థతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బీఆర్ఎస్ తరపున ఓడిన అభ్యర్థులను వేదిక మీదకు పిలవాలన్నారు. సీఎం రేవంత్ కూడా కొడంగల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యరి్థని వేదిక మీద కూర్చోబెట్టాలని చెప్పారు. హుజూరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఆసిఫాబాద్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు పెడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎర్రబుగ్గలు వేసుకొని తిరుగుతున్నారు: సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలను కాదని, కాంగ్రెస్ నాయకులను అతిథులుగా పిలుస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు వాహనాలపై ఎర్రబుగ్గలు వేసుకొని తిరుగుతున్నారని, స్పీకర్కు తెలియకుండా ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీకి కూడా అనుమతించండి : పద్మారావుగౌడ్ తమపై ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రభుత్వ కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నారని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను కూడా శాసనసభకు అనుమతించాలని స్పీకర్కు సూచించానని చెప్పారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. -
అవి రైతుల పాలిట ఉరితాళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి విధించిన షరతులు రైతుల పాలిట ఉరితాళ్లుగా బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభివరి్ణంచారు. ఈ నిబంధనలు రైతాంగాన్ని వంచనకు, మోసానికి గురిచేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల శాపనార్ధాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగలడం ఖాయమన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని ఇచి్చన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి కూడా అద్దాల మేడలో కూర్చొని, తనకు ఐదేళ్లపాటు అధికారం ఇచ్చారనే ఆహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రూ.34 వేల కోట్ల రైతుల రుణమాఫీని బేషరతుగా చేస్తామన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నిబంధనల పేరుతో హల్లికి హల్లి సున్నకు సున్నా అన్నట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో రే వంత్ ప్రభుత్వం నమ్మకం కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై సీఎం రేవంత్కు ఉన్న ధ్యాస రైతు రుణమాఫీ, రూ.500 బోనస్, ఆడబిడ్డలకు రూ.2500, రూ.4వేల పెన్షన్, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి రూ.4 వేలు, కాలేజీ పిల్లలకు స్కూటీలు.. వంటి హామీలను అమలు చేయడంపై లేదన్నారు. ఫిరాయింపుల పర్వం చూస్తుంటే కేసీఆర్ జుట్టు నుంచి రేవంత్రెడ్డి పుట్టినట్టు ఉందని ఎద్దేవాచేశారు. రేవంత్రెడ్డి చదువుకున్నారా? లేదా? ‘తెల్లరేషన్ కార్డు ఎవరికి ఇస్తారు. రేవంత్రెడ్డి చదువుకున్నాడా? లేదా? మూడున్నర ఎకరాల తరిపొలం, ఏడు ఎకరాల కుష్కి పొలం ఉన్నవారికి మాత్రమే తెల్లరేషన్ కార్డు వస్తుంది. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వక పదేళ్లు అవుతుంది. మీరు వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు పేరుతో సగం మందికి, ఆదాయపన్ను పేరుతో 20%మందికి, రీ షెడ్యూల్ పేరుతో ఇంకొంత మందికి రుణమాఫీ ఎగ్గొడుతున్నారు. పొమ్మనక పొగబెట్టడం, ఎగబెట్టుడు తప్ప ఇంకొకటి లేదు’అని ఈటల ధ్వజమెత్తారు. -
రేవంత్ పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు:ఈటల
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ పాలనలో మరోసారి మోసపోయామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని, ఈ ప్రభుత్వం ప్రజల్ని దండుకోవడం తప్ప పరిపాలన చేయడం లేదని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. .. రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి(రాజకీయ పార్టీలు, నేతలు... ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని గతంలో రేవంత్ చెప్పిన మాటల వీడియోను ఈటల ప్రదర్శించారు). ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. మాట తప్పిన వాళ్ళను కాలం ఖచ్చితంగా బొంద పెడుతుంది. విశ్వసనీయత లేని పార్టీలను, మోసం చేసినవాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు అని అన్నారాయన. తెలంగాణ ప్రజలు.. మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడ లో కూసొని పేదల గురించి ఆలోచించడం లేదు. రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్లు. మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వరు. ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారికి రేషన్ కార్డు ఉండదు. పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంతో.. 69 లక్షల మంది రైతులకు నిరాశ ఎదురవుతుంది. రుణ మాఫీ చేస్తానని రేవంత్ అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు. రూ. 34 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్... ఇప్పుడు నిబంధనల పేరిట రైతులకు సున్నం పెడుతున్నారు. ఇదేకాకుండా.. వరి ధాన్యంకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి రేవంత్ మోసం చేశారు. రైతులను మోసం చేసిన రాజ్యం బాగుపడదు.కాంగ్రెస్ మ్యానిఫెస్టో చిత్తుకాగితంతో సమానం. రైతుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తప్పవు. అప్పుల పేరిట.. శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారు. 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న దొమ్మరోళ్ళ, బిచ్చగాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారు’’ అని ఈటల అన్నారు. ఇక.. తాజా ప్రొటోకాల్ వివాదంపైనా ఈటల స్పందించారు. కూకట్పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమానికి ఈటలకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఇంతకు ముందే ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు. అయితే తాజాగా ఈ వివాదంపై మాట్లాడుతూ.. ‘‘ రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు. కానీ, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధుల్ని ఆహ్వానించాలి. కానీ, అధికారులు అలా చేయలేదు. ప్రభుత్వం పిలవలేదు. రేవంత్ తీరును ప్రజలు రికార్డు చేసుకుంటున్నారు’’ అని అన్నారాయన. -
‘పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: పవర్ కమిషన్ విచారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘పవర్ కమిషన్ చైర్మన్ మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వెంటనే జడ్జిని ఎవరిని నియమిస్తారో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియజేయాలి. విచారణ న్యాయబద్ధంగా జరగడం లేదు. కమిషన్ విచారణ పారదర్శకంగా జరగాలి. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. ఇప్పటికైనా కమిషన్ల పేరుతో కాలయాపన మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు. చదవండి: TG: పవర్ కమిషన్కు సుప్రీంకోర్టు షాక్ -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి.. స్పీకర్ గడ్డం ప్రసాద్తో కేటీఆర్ భేటీ
సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ రాజ్యాంగం పట్టుకొని ఫోజులు కొడుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పుడుతుందని ధ్వజమెత్తారు.మంగళవారం(జులై16)పార్టీ మారిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కేటీఆర్తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.మార్చి 18న దానం నాగేందర్ పై ఫిర్యాదు చేశాం.ఇతర ఎంఎల్ఏల విషయంలో కూడా అనర్హత వేటు వేయాలని కోరాము.పలువురు నేతలు బీఆర్ఎస్ కాంగ్రెస్లో చేరి నాలుగు నెలలు అవుతుంది. వారిపై చర్యలు తీసుకోకపోతే అది స్పీకర్ పదవికే అవమానని తెలిపారు.మూడు నెలల్లో పార్టీ మారిన ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మణిపూర్లో పార్టీ మారిన ఎంఎల్ఏపై చర్యలు తీసుకున్నారు.ఇక్కడ కూడా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరినట్లు కేటీఆర్ చెప్పారు. రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాందీ ఫోజులురాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాందీ ఫోజులు కొడుతారు కానీ ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఫైరయ్యారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన ఎంఎల్ఏ పై చర్యలు తీసుకోవాలని అక్కడ కాంగ్రెస్ కోరుతుంది. కర్ణాటక లో 50 కోట్ల చొప్పున కాంగ్రెస్ ఎంఎల్ఏ లను కొన్నారని అక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నారు..పార్టీ మారబోమని గోవా కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ ప్రమాణం చేయిస్తున్నారు. కానీ తెలంగాణలో ఏదెచ్చగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. -
షరతులు లేకుండా రుణమాఫీ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి షరతులు..నిబంధనలు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయా లని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీకి రేషన్కార్డును ప్రామాణికం చేయడం ద్వారా ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందరికీ రుణమాఫీ ఇవ్వలే కనే కాంగ్రెస్ ప్రభుత్వం షరతులతో కొత్తకథలు చెబుతోందని మండిపడ్డారు. దీనిపై గతంలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చినప్పుడు ఎలాంటి షరతులు విధించని విషయాన్ని గుర్తుచేశారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి... ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్కార్డు ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు రుణ మాఫీకి మాత్రం రేషన్కార్డును లింక్ చేస్తోందని ధ్వజమెత్తారు. చాలామందికి ఇది వర్తించకుండా ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో ఒకే రేషన్కార్డుపై చాలామంది పేర్లు ఉంటాయని, అందులో నలుగు రికి రుణాలుంటే ఒక్కరికే మాఫీతో మిగతావారు నష్ట పోతారన్నారు. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే వారితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో గెలిపించి చేర్చుకోవాలని సీఎంకు సూచించారు. సీఎం రేవంత్కు మరో బహిరంగలేఖ గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డికి రాసిన బహిరంగలేఖలో మహేశ్వర్రెడ్డి కోరారు. పంచాయతీల్లో నిధులు లేక పనులు చేయలేమని ప్రజావాణిలో గ్రామ కార్యదర్శులు వెల్లడించినా.. సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తీరులో మార్పు రాకపోతే ప్రజాక్షేత్రంలో సర్కార్ తీరును ఎండగడతామని తెలిపారు. వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
వలపోతల కంటే వడపోతలపైనే దృష్టి : మాజీ మంత్రి హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలను పరిశీలిస్తే రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా స్పష్టమవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిందని ఎద్దేవా చేశారు.2018 డిసెంబర్ 12వ తేదీకి ముందు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించదనే నిబంధన అసమంజసం అని పేర్కొన్నారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతోందని నిందించారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం ద్వారా లక్షలాదిమంది రైతుల ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందని హరీశ్రావు ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవి మార్గదర్శకాలు కావు.. మభ్యపెట్టే ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మార్గదర్శకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కొంతమందికే రుణమాఫీని పరిమితం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.2లక్షల పంట రుణం తీసుకున్న రైతుల జాబితాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ డేటాను మార్గదర్శకంగా తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పని కాంగ్రెస్ ఇప్పుడు లోపభూ యిష్ట షరతులు విధిస్తోందని నిందించారు. రైతు రుణమాఫీకి రేషన్కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల క్రితం చెప్పిన సీఎం రేవంత్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో చెప్పాలని కోరారు. రేషన్ కార్డులు లేని రైతులు, పది ఎకరాల భూమి ఉండి కూడా పింక్ రేషన్ కార్డు కలిగిన రైతుల సంగతేంటో తేల్చాలని ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలు అధికారులు, రైతుల నడుమ చిచ్చు పెట్టేలా ఉన్నాయని నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.