-
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. బీజేపీ మిత్రక్షాులైన టీడీపీ, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు రూపొందించినట్లు ఉందన్నారు. బిహార్కు రూ.41వేల కోట్లు ఆర్థిక సాయం.. ఏపీకి రూ.15వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు కేటాయించి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.‘2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్, కానీ కొత్త రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసింది. 2014 తర్వాత మొదటిసారిగా, బడ్జెట్లో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం' పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు, కానీ ఆర్థిక 58 పేజీలు, 14,692 పదాలున్న తన మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఖండింస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం, ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించాంపోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలి.రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారు. అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించింది’ అని అన్నారు. -
బడ్జెట్లో తెలంగాణకు గుండుసున్నా: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదని, కాంగ్రెస్,బీజేపీ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మంగళవారం(జులై 23) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో వెనుకబడిన జిల్లాలపై కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు. కిషన్రెడ్డి,బండి సంజయ్ ఏం చేస్తున్నారు ? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ లేదు. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసింది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా’అని హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కనీసం 15 రోజులు జరపాలని కోరితే ప్రభుత్వం దానిని కేవలం 4 రోజులకు కుదించిందని మండిపడ్డారు. తమ హయాంలో బడ్జెట్ సమావేశాలు 9 రోజులు నిర్వహించి డిమాండ్లపైనా చర్చించేవాళ్లమని గుర్తుచేశారు. -
తెలంగాణ భవన్కు గులాబీ బాస్
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయనపాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్కు కేటీఆర్ చేరుకోగా, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.రైతు రుణమాఫీ, నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నించాలని కేసీఆర్ సూచించనున్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కూడా గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.కాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు సమావేశాలు జరగనున్నాయి. మధ్యలో ఆదివారం 28వ తేదీన సభకు సెలవు ప్రకటించింది. 25వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 31వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. -
కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించవచ్చని ఓ జర్నలిస్ట్ ఈ ఉదయం నన్ను అడిగారు. గత 10 సంవత్సరాలుగా మనకు వచ్చేదే రావొచ్చని నేను బదులిచ్చాను. అదేంటంటే.. పెద్ద సున్న మాత్రమే’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.A journalist asked me this morning about my expectations for Telangana from Union Budget Told him that we will get the same thing that we got for last 10 yearsA Big Zero— KTR (@KTRBRS) July 23, 2024 మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని, నూతన చట్టాలపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని తెలిపారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. -
TG: ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రసాద్కుమార్ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటించింది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టారు. లాస్య నందిత మరణం పట్ల రెండు నిమిషాలు సభ మౌనం పాటించింది. అనంతరం సభ రేపటి వాయిదా పడింది. అనంతరం స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం నిర్వహించారు.ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలుబీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి హరీష్రావు, సీపీఐ నుంచి కునంనేని హాజరయ్యారు. ఈ నెల 31వ తేది వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మధ్యలో ఆదివారం 28వ తేదీన సెలవు ప్రకటించింది. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 31వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. బీఏసీ సమావేశానికి ప్రోటోకాల్ పాటించకపోవడంపై హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కలలో కూడా ఊహించలేదు: కేటీఆర్లాస్య నందితకు సంతాపం తెలిపే పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురైయ్యారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న నిబద్ధతతో కలిసి పనిచేశారు. సాయన్న కోరినట్టు కవాడిగూడ నుంచి లాస్యను గెలిపించుకున్నము. సాయన్న మరణం నుంచి అప్పడప్పుడే కోలుకుంటున్న ఆ కుటుంబం మరోసారి విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా యాక్సిండెంట్కు గురై మృతిచెందడం అత్యంత ఆవేదన కలిగించిన అంశ. ఏడాదిలోపే తండ్రి, కూతురు మరణించటమంటే ఆ వార్త వినటానికే ఎంతో ఆవేదనగా ఉంటుంది. అలాంటిది ఆ కుటుంబం. పరిస్థితిని ఎలా ఎదుర్కొందో తలచుకుంటేనే బాధగా ఉంది’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ ఇదే శాసనసభలో హామీ ఇచ్చారు. లాస్య నందిత చాలా చురుకైన అమ్మాయి సాయన్న సేవలు పార్టీ అండతో లాస్య గెలిచి అసెంబ్లీలోకి వచ్చింది. సాయన్న మాదిరిగానే ప్రజా సేవ చేయాలనుకున్న లాస్య నందితకు మంచి అవకాశం వచ్చింది. లాస్య కారు ప్రమాదానికి వారం ముందు కూడా నల్గొండ బహిరంగ సభలోనూ యాక్సిడెంట్ జరిగింది. తండ్రి మరణం, ఆ తర్వాత నల్గొండ సభలో జరిగిన యాక్సిడెంట్ ఇలా విధి పగబట్టింది. కానీ తన సంతాపం తెలిపే పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా నిలవాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ మళ్లీ ఆ కుటుంబంలోనే సాయన్న మరో కూతురు నివేదితకు పార్టీ సీటును కేటాయించింది. అయితే దురదృష్టవశాత్తు తన ఓడిపోవటం జరిగింది. తండ్రి, కూతురును కోల్పోయిన ఆ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.లాస్య మరణించడం బాధాకరం: సీఎం రేవంత్లాస్య మృతి బాధాకరమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రజా జీవితంలోనే మరణించారు. సాయన్న వారసురాలిగా కుమారి లాస్య నందితను ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కానీ ప్రమాదవశాత్తు లాస్య మరణించడం బాధాకరం. సాయన్న మృదుస్వభావి.. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి ఉండేవారు.‘‘కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలన్న సాయన్న కోరిక. దురదృష్టవశాత్తు అది నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేరు లాస్య బతికి ఉన్నా ఆయన సంతోషించి ఉండేవారు. కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరం. వారు మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి ఆశయాలను, వారు చేయాలనుకున్న పనులను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా’’ అని రేవంత్ చెప్పారు. కేసీఆర్కు కేటాయించిన ఛాంబర్పై కేటీఆర్ అసంతృప్తిఅసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్కు కేటాయించిన ఛాంబర్పై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రూమ్లు కలిపి ఒకే రూమ్గా అసెంబ్లీ సిబ్బంది మార్పు చేశారు. రూం మధ్యలో వాష్ రూం పెట్టీ వాడుకోవడానికి అనుకూలంగా లేకుండా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ అంశాన్ని బీఏసీలో లేవనెత్తాలని హరీష్రావుకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది.గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాళులుగన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, సునితా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, కాలేరు వెంకటేష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి,పాడి కౌశిక్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అందుకే కేంద్రం నిధులు ఆపింది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులు 800 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో ఉపాధి హామీలో పని చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కేంద్రం నిధులు ఆపిందని సునీత లక్ష్మారెడ్డి అన్నారు.ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ సర్పంచ్ల పదవీకాలం ముగిసినా వారికి బిల్లులు రాలేదు. మన ఊరు మన బడి ద్వారా చేసిన పనులకు బిల్లులు ఆపారు. చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీల పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించింది. -
అసెంబ్లీకి వెళ్లనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తుంటి ఎముక సర్జరీ నుంచి పూర్తిగా కోలుకొనేందుకు గత రెండు విడతల అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె. చంద్రశేఖర్రావు తాజాగా జరగనున్న బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ నెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎదురుగా ఉన్న గన్పార్కులో నివాళులు అర్పించనున్నారు. మరోవైపు పార్టీ మారిన తమ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అలాగే జాబ్ కేలండర్ కోసం ఉద్యమించిన వారిపై ప్రభుత్వ దమనకాండ, శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో గళం వినిపించనుంది. చేనేత కార్మీకుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆరు గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షల వల్ల రైతులకు జరుగుతున్న నష్టం తదితరాలను కూడా ప్రస్తావించనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీకి బీఆర్ఎస్ ప్రతినిధిగా మాజీ మంత్రి హరీశ్రావు హాజరుకానున్నారు. నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ... అసెంబ్లీ వాయిదా అనంతరం మంగళవారం ఒంటి గంటకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శాసనసభాపక్ష నేత కేసీఆర్ ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా మేడిగడ్డ బరాజ్ను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
మొద్దు నిద్ర ప్రభుత్వం.. తట్టినా లేవట్లేదు∙
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, బీఆర్ఎస్ పార్టీ.. ఈ సర్కారును తట్టి లేపినా నిద్ర లేవట్లేదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నా కనీసం రోజువారీ సమస్యలను కూడా రేవంత్ ప్రభుత్వం పరిష్కరించడం లేదని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఒక్కటి కూడా ముందడుగు వేయడం లేదని విమర్శించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోయాయని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ ఏడాది మార్చికి ముందే పంచాయతీలకు రూ.500 కోట్లు విడుదలైనా కారి్మకులకు కనీసం జీతాలు అందడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం మరో రూ.750 కోట్ల నిధుల విడుదలను నిలిపివేసిందని వెల్లడించారు. ఆసరా పింఛన్లు, మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి వేతనాల చెల్లింపులో కూడా తాను ప్రశ్నించిన తర్వాతే కొంత చలనం వచి్చందన్నారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు లింక్ లేదని సీఎం రేవంత్ చెప్పినా అమలు కావడం లేదని హరీశ్రావు అన్నారు. రూ.లక్ష లోపు రుణమాఫీకి అర్హులైన వారిలో 30 నుంచి 40 శాతం మందికి లబ్ధి జరగలేదని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ప్రభుత్వ బదిలీల్లో పారదర్శకత లేకఅన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయని అన్నారు. -
మోసం చేయడమే కాంగ్రెస్ పని: మాజీ మంత్రి జగదీష్రెడ్డి
సాక్షి,సూర్యాపేట జిల్లా: ఆరు గ్యారంటీలు అని చెప్పుకోవడానికే తప్ప ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి జగదీష్రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో సోమవారం(జులై 23) జగదీష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఉచిత బస్సు అని నమ్మించి మోసం చేసి బస్సులు తగ్గించారు.మహిళలు ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకునేలా చేశారు. రైతుల రుణమాఫీ కంటే ఫ్లెక్సీలు, పాలాభిషేకాలకే ఖర్చు ఎక్కువైంది. ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పని. 24 గంటల కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. గోదావరికి వరద వచ్చినా కాళేశ్వరం ఎక్కడికీ పోలేదు క్షేమంగా ఉంది. అక్కడ మీరు స్విచ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది’అని జగదీష్రెడ్డి అన్నారు. -
TG: రేపు అసెంబ్లీకి కేసీఆర్ !
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవనున్నారు. మంగళవారం(జులై 23)నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కాగా, మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికి మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లడతారనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ లేవనెత్తనున్న అంశాలు ఇవే..నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలుజాబ్ కేలండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్ధులపై ప్రభుత్వ దమనకాండరాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యంచేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిఆరు గ్యారంటీల అమలు ..శాసన సభలో చట్టబద్దతరైతు రుణ మాఫీ అమల్లో ఆంక్షలు-నష్టపోతున్న రైతాంగంపంటలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యంరైతుభరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులుగ్రామాలు ,పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం -పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటు పడుతున్న ప్రజారోగ్యంఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని, నూతన చట్టాలపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని తెలిపారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్గా ఉన్న తెలంగాణ గడ్డపైన నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యధాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా అని ప్రశ్నించారు. లేక తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని తెలిపారు.నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలని కోరారు. దీంతోపాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని గుర్తుంచుకోవాలని హె చ్చరించారు. -
ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ర ఏవంత్ భేటీయ్యారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ఛార్జి దీప దాస్ మున్షీ ఉన్నారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు, నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకకు సీఎం వివరించారు. ఈ నెలాఖరున వరంగల్లో రైతు రుణమాఫీ విజయోత్సవ బహిరంగసభ నిర్వహిస్తామని ఇటీవలే సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సభకు ఏఐసీసీ నేతలను ఆహ్వానిస్తున్నారు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో, రేపు వీరంతా హైదరాబాద్ రానున్నారు. -
ఉచిత కరెంట్ ఏది.. గృహజ్యోతిలో గందరగోళం: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖను తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గృహజ్యోతి పథకంలో గందరగోళం ఏర్పడిందన్నారు. అలాగే, రేవంత్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా అనాలోచిత నిర్ణయం అని కామెంట్స్ చేశారు. కాగా, తాజాగా హరీష్రావు మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రతరమైంది. కరెంట్ పోతుంది అంటే తొండలు పడ్డాయి అంటున్నారు. కరెంట్ పోతుంది అంటే హరీష్ రావు కరెంట్ తీయించేస్తున్నారని చెప్తున్నారు. నిర్వహణ లేక కరెంట్ సమస్యలు వస్తున్నాయి. కరెంట్ బిల్లులు కట్టాల్సిందేనని మా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఉచిత కరెంటు ఇచ్చే వృత్తి కులాలకు ఫ్రీగా ఇవ్వటం లేదు. 91 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు గృహ జ్యోతి అందరికీ రావటం లేదు. గృహ జ్యోతి పథకంలో గందర గోళం ఏర్పడింది.ఇదే సమయంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వటం లేదు అని చెప్పాను. ఆ వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులకు జీతాలు విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు అధ్వాన్నంగా మారాయి. సమస్యలతో కొట్టు మిట్టాడుతుంది. పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం లో గ్రామ పంచాయతీలకు 270 కోట్లు ఇచ్చేవాళ్ళం. 750 కోట్లు కేంద్రం పంచాయతీ ఎన్నికలు జరపలేదని నిధులు ఆపింది.తాజా మాజీ సర్పంచులు నా దగ్గరికి వచ్చి పిర్యాదు చేసారు. వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సర్పంచులు మాజీలు అయ్యారు. పంచాయతీ సెక్రటరీలు ఖర్చులు పెట్టుకొని గ్రామ పంచాయతీలు ఈ రెండు నెలలు నడిపించారు. కానీ, వారిని బదిలీలు చేస్తున్నారు. ఆ ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి వస్తాయా లేదా అనే డైలమాలో ఉన్నారు. పాఠశాలలకు కూడా కూడా నిధులు ఇవ్వకపోగా పారిశుద్ధ్యం లేక స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల పెండింగ్ బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన నిధులు ఆపడం వల్ల వడ్డీలు కట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలల్లో పని చేసే సిబ్బందికి ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలు నుంచి జీతాలు లేవు.రైతు రుణమాఫీకి రేషన్ కార్డు వద్దని చెప్పాను. పాస్ బుక్ ఉంటే చాలని రాత్రికి మళ్ళీ ప్రభుత్వం చెప్పింది. కానీ గ్రౌండ్ లెవల్లో మాత్రం రేషన్ కార్డుతోనే రుణమాఫీ చేస్తున్నారు. గ్రామాల్లో లక్ష రుణమాఫీ అంశంలో దాదాపు 30 నుంచి 35 శాతం మందికి రుణమాఫీ కాలేదు. మేము చేసిన సర్వేలో ఇది తేలింది. కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి తండ్రికి రుణమాఫీ ఆపుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అర్హులందరికీ రైతు రుణమాఫీ చేయాలి. రేషన్ కార్డు నిబంధన తొలగించాలి. రైతును గుర్తించి రుణమాఫీ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
కిషన్రెడ్డి.. హైదరాబాద్ గురించి ఆలోచించండి: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ విభజన హామీలకు సంబంధించి నిధులు కేటాయించేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.కాగా, సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రతీ రూపాయి అడుగుతున్నాము. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలి. గత పది సంవత్సరాలుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరిగింది. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ పెంచాలి. రాష్ట్రంలో నవోదయ, సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలి.గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చినా సీఎం కలిసే వారు కాదు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం పని చేస్తాం. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలి. యూనివర్సిటీల అభివృద్ధి కోసం నిధులు తెచ్చేలా కిషన్ రెడ్డి కృషి చేయాలి. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా కృషి చేస్తున్నాం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి సానుకూలంగా పరిష్కరించుకునేలా ముందుకు పోతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
12 మరణాలు ప్రభుత్వ హత్యలే.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘కాంగ్రెస్ పాలనలో చితికిన చేనేతరంగం.. కార్మికుల హాహాకారం మిన్నంటింది. రాష్ట్రంలో నేతన్నల మరణ మృదంగం కొనసాగుతోంది. గడిచిన 7 నెలల్లో 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది.మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవారు చేతిలో పనుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడాల్సి వస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటక్కెక్కించడంతో చేనేతరంగం చితికిపోయింది. రాష్ట్ర వస్త్ర శాఖ కుదేలు కావడంతో సాంచాలను తుక్కుకింద అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ♦️ కాంగ్రెస్ పాలనలో చితికిన చేనేతరంగం.. కార్మికుల హాహాకారం♦️రాష్ట్రంలో నేతన్నల మరణ మృదంగం.. 7 నెలల్లో 12 మంది ఆత్మహత్యకాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది.… pic.twitter.com/u1uGQOX8md— BRS Party (@BRSparty) July 22, 2024 ఇటు పనుల్లేక.. అటు కుటుంబాలను పస్తులుంచలేక.. మరోవైపు అప్పులు తీర్చే దారిలేక ఏడు నెలల్లోనే 12 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతను కండ్లకు కడుతున్నది. చేనేత రంగంలో మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి దారుణ పరిస్థితులు వచ్చాయని కార్మికుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఓడినా సంబురాలు చేసుకున్న పార్టీ కాంగ్రెస్
పంజగుట్ట (హైదరాబాద్): గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యతిరేక శక్తులు బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు కుట్రలు పన్నాయని, కానీ ప్రజలు ఆ శక్తుల కుట్రలను తిప్పికొట్టి బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజిగూడలోని జయాగార్డెన్స్లో బీజేపీ సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్రెడ్డి మాట్లాడుతూ.. అధికారం, ఎన్నికలతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లే పార్టీ బీజేపీ అని అన్నారు. నెహ్రూ తరువాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా సాధించలేదని, కానీ రాహుల్ గాంధీ ప్రధాని అయినట్లు ఆ పార్టీ నాయకులు ఊహాగానాల్లో తేలిపోయారని, ఎన్నికల్లో ఓడిపోయి కూడా సంబురాలు చేసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు.. రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తొలగిస్తారు అని తప్పుడు ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ను పలు మార్లు అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని విమర్శించారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన వస్తుందని, ఉగ్రవాదం, అవినీతి పెరిగిపోతాయని ప్రజలు గ్రహించారని, అందుకే బీజేపీని మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు. లోక్సభ కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవడం, రాజ్యాంగం గురించి తప్పుడు ప్రచారం చెయ్యడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతంరావు, పార్టీ నేతలు ఆనంద్ గౌడ్, ఎన్.వి.సుభాష్, శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ ‘ప్రధాని’లా ఫీలయ్యారు.. కిషన్ రెడ్డి సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోయినా సంబురాలు చేసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అలాగే, మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, సోమాజీగూడ జయ గార్డెన్లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విసృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసింది. బీఆర్ అంబేద్కర్ను అనేకసార్లు అవమానించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించాలని కుట్ర చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాద శక్తులు చాపకింద నీరులా ఎన్నికల్లో ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా కుతంత్రాలు పన్నారు. మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించారు. దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే వారి ఉద్దేశం. ఎన్నికల్లో ఎంఐఎం తప్పుడు ప్రచారం చేసింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నిజస్వరూపం మరోసారి బయటపడుతుంది. లోక్సభ జరగకుండా అడ్డుపడటం.. రాజ్యాంగం గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా సాధించలేదు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం ప్రధాన మంత్రి అయినట్లు ఊహాగానాల్లో తేలిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయి సంబురాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో మొదటిసారిగా చూస్తున్నాం. ఎన్నికల్లో ఓడిపోయిన అసహనంతో పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అబద్ధాలు, తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మారు. ఎన్నికల్లో పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీ. కానీ, బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసింది మజ్లిస్ పార్టీ. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోతుందని దేశ ప్రజలు గ్రహించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణచివేసిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్లో బాంబుపేలుళ్లతో ప్రజలు వణికిపోయారు. -
రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలను రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని కూడా కలుస్తామన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ వైపు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు పోజులు కొడుతూ మరోవైపు దానిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్యనాయకులు శనివారం రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో సుమారు అరగంటసేపు భేటీ అయ్యారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, ప్రొటోకాల్ ఉల్లంఘనపై గవర్నర్కు వినతిపత్రాలు సమరి్పంచి, అందులోని అంశాలను కేటీఆర్, హరీశ్రావు గవర్నర్కు వివరించారు. అనంతరం గవర్నర్తో భేటీ వివరాలను కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. ‘రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్లో చేర్చుకున్నట్లు గవర్నర్కు వివరించాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఓ వైపు న్యాయపోరాటం చేస్తున్నాం. మరోవైపు స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశామనే విషయాన్ని గవర్నర్కు వివరించాం. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు, పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోచేరినా వారిపై చర్యలు లేవనే విషయాన్ని ప్రస్తావించాం. ప్రొటోకాల్ ఉల్లంఘనతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పాం. ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లడం సరికాదనే అభిప్రాయం గవర్నర్ వ్యక్తంచేశారు. ఈ అంశంపై ప్రభుత్వ వివరణ కోరుతూ లేఖ రాస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. విపక్ష పారీ్టగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనను కలవాలని గవర్నర్ చెప్పారు. తన పరిధిలో ఉన్న అంశాల్లో తప్పనిసరిగా న్యాయం చేస్తానన్నారు. నిరుద్యోగుల విషయంలో గవర్నర్ సీరియస్గా స్పందించిన తీరుకు అభినందనలు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ సీరియస్గా స్పందించారు ‘రాష్ట్రంలో యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీల ఉల్లంఘనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామనే హామీని నిలబెట్టుకోలేదు. సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి, కేసులతో భయానక వాతావరణం నెలకొంది. ఈ అంశంపై హోం శాఖ కార్యదర్శిని పిలిచి మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది’అని కేటీఆర్ చెప్పారు. ‘మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకుపోయి కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు గంగపాలైందని భూతద్దంలో చూపుతూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి. కొద్దిరోజుల్లోనే మరమ్మతులు పూర్తయి ప్రస్తుతం మేడిగడ్డ నిండుకుండను తలపిస్తోంది. త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్ల రూపాయల లాభం వస్తుందని సీఎం రేవంత్ చెప్పారని, ఇప్పుడు నాలుగు నెలలపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఆయనకు అందులో వాటా ఎంత వస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. చేసింది చెప్పుకోవడంలోనే ఉంది: గవర్నర్ ప్రస్తుత రాజకీయాల్లో చేసింది చెప్పుకోలేక పోవడంతో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బీఆర్ఎస్ బృందంతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గతంలో తమిళనాడులో కామరాజ్ నాడార్ ప్రభుత్వం అనేక మంచి పనులు చేసినా.. చేసింది చెప్పుకోలేక ఓటమి పాలైన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయాలన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయని, పార్టీ ఫిరాయింపులు సహా ప్రజలు అన్ని అంశాలను నిశితంగా గమనిస్తారని చెప్పినట్లు సమాచారం. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని కితాబునిచ్చినట్లు తెలిసింది. గవర్నర్తో భేటీలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
గవర్నర్ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్పై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం సమావేశమయ్యారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పాల్గొన్నారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులు, పార్టీ ఫిరాయింపుల అంశం, ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.గవర్నర్తో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని గవర్నర్కు వివరించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు తుంగలో తొక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులపై కేసులు, దాడులు జరుగుతున్నాయని.. హైదరాబాద్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. మొదటి సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే లేదని అన్నారు. గతంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవని తెలిపారు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకొచ్చి అరెస్టులు చేశారన్నారు.‘రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఖననంపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం. పార్టీ ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేశాం. భయపెట్టి పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తేదీలతో సహా గవర్నర్కు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశాం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని వివరించాం. ఈ రెండు అంశాలపై గవర్నర్కు సుదీర్ఘంగా మా అభ్యర్థన వినిపించాం. హోమ్ శాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలిపారు. ఎమ్మెల్యేలపై ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరుగుతుంది. మాలో ఎవరికి కూడా నియోజకవర్గాల్లో గౌరవం దక్కడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలుస్తాం. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయంపై వివరిస్తాం. కాళేశ్వరంలో జరిగిన చిన్నతప్పి దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను సందర్శిస్తాం’ అని తెలిపారు -
కాంగ్రెస్కు ఐదేళ్లూ పట్టదు: కిషన్ రెడ్డి సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ బుద్ధి చెప్పడానికివ పదేళ్ల కాలం పట్టింది కానీ, కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి కనీసం ఐదేళ్లు కూడా పట్టదు అంటూ విమర్శలు చేశారు.కాగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం నిరుద్యోగుల మహాధర్నాలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత ఆత్మబలిదానం చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించింది. గత బీఆర్ఎస్ యువత ఆశలను నట్టేట ముంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యూత్ డిక్లరేషన్తో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక, రేవంత్ సభల్లో రెండు లక్షల ఉద్యోగాలు అంటూ ఉదరగొట్టారు. రుణమాఫీ కూడా రైతులను మభ్య పెట్టేలా చేశారు. ఇచ్చిన హామీ ప్రకరం అందరికీ చేయాలి కానీ.. కొంతమందికే రుణమాఫీ చేసి పాలాభిషేకం చేయించుకుంటున్నారు.జాబ్ కాలెండర్ ఎటు పోయింది రేవంత్ రెడ్డి?. 18 ఏళ్లు నిండిన కాలేజీ అమ్మాయిలకు స్కూటీ అన్నారు మర్చిపోయారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని నట్టెట ముంచారు. ప్రజాపాలనలో సెక్రటేరియట్లోకి సామాన్యులకు ఎంట్రీ లేదు. కాంగ్రెస్ పైరవీకారులకు మాత్రమే ఉంది. విద్యా భరోసా కార్డులు ఎటు పోయాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయి. కేసీఆర్కి బుద్ది చెప్పడానికి పదేళ్లు పట్టింది కానీ, కాంగ్రెస్కు బుద్ది చెప్పడానికి కనీసం ఐదేళ్లు కూడా పట్టదు.చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకెళ్ళి రేవంత్ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది తెలంగాణ పరిస్థితి. కేసీఆర్ పోయి రేవంత్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ కాంగ్రెస్కు, రేవంత్కు లాభం జరిగింది. నిజమైన మార్పు రాష్ట్రంలో రాలేదు. వచ్చిన మార్పు కేసీఆర్ కుటుంబం పోయి సోనియా కుటుంబం వచ్చింది. గులాబీ జెండా పోయి చెయ్యి గుర్తు జెండా వచ్చింది. ప్రజలను దోపిడీ చేసే స్వేచ్చ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. బీఆర్ఎస్ చేసినట్లే కాంగ్రెస్ చేస్తుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులు కాంగ్రెస్ చేస్తోంది. అవినీతి పాలనలో, దోపిడీలో, ఫిరాయింపుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుంది. బీజేవైం ద్వారా మా పోరాటాలు యువత కోసం కొనసాగుతాయి అంటూ కామెంట్స్ చేశారు. -
రుణమాఫీలో మాది ఆల్ టైం రికార్డ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో పాలనలో తెలంగాణలో వ్యవసాయ రంగం స్వర్ణయుగం సాధించడంతోపాటు రుణమాఫీలో రైతులకు రూ.1.20లక్షల కోట్లు లబ్ధి చేకూర్చి దేశంలోనే ఆల్ టైం రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం హరీశ్రావు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా బీఆర్ఎస్ పాలనలో రైతులకు జరిగిన లబ్ధిని వివరించారు.కేసీఆర్ పాలనలో వివిధ పథకాల కింద రైతులకు రూ.1.20 లక్షల కోట్లు నేరుగా సాయం అందించిందన్నారు. రైతుబంధు కింద 69 లక్షల మంది రైతులకు రూ.72,972 కోట్లు, రైతు బీమా కింద 1.11 లక్షల మంది రైతులకు రూ.6,488 కోట్ల తమ ప్రభుత్వ హయాంలో చెల్లించామన్నారు. రైతు రుణమాఫీ కింద రెండు విడతల్లో కలుపుకుని రూ.29,144.61 కోట్లు చెల్లించామన్నారు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రైతులకు రూ.11,401 కోట్లు సాయం అందించామన్నారు. చిరుద్యోగుల వెతలు తీర్చండి ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వారికి వేతనాలివ్వాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రతీ నెలా 1న వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. -
ఊరించి.. కంటతడి పెట్టించారు!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై రైతులను ఏడు నెలలుగా ఊరించి, చివరకు కంటతడి పెట్టించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. ‘చారాణ కోడికి.. బారాణా మసాలా’అనే సామెతను తలపించేలా రుణమాఫీపై ప్రభుత్వం తీరు ఉందన్నారు. అర్హత ఉన్నా అనేక మంది రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదో చెప్పే నాథుడు లేడని, రైతుల గోడు వినేవారే లేరని అన్నారు. రుణమాఫీ జరగని అర్హులైన రైతులు ఓ వైపు ఆందోళనలో ఉంటే, సంబురాలు ఎందుకని శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.40 లక్షల మంది లబ్ధిదారుల్లో 30 లక్షల మంది రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు వ్యవసాయ సీజన్లు కావస్తున్నా రైతు భరోసాను ప్రారంభించలేదన్నారు. రైతు భరోసా, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు వంటి హామీలను అమలు చేయకుండా మభ్య పెడుతోందన్నారు. ఇంతకాలం ప్రజల దృష్టిని మళ్లించిన రేవంత్ ప్రభుత్వం, ప్రస్తుతం నిధుల దారిమళ్లింపునకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు.పేదరిక నిర్మూలనలో రెండో స్థానంకేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టడంతో పేదరిక నిర్మూలనలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని కేటీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) లెక్కలే దీనికి నిదర్శనమన్నారు. పదేళ్లపాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు.2020–21తో పోలిస్తే 2023–24 (ఎస్డీజీ)లో 74 స్కోర్తో తెలంగాణ ముందుందని చెప్పారు. అంతకుముదు 2020 –21తో పోలిస్తే ఐదు పాయింట్లు మెరుగైందన్నా రు. చాలారంగాల్లో తెలంగాణ సాధించిన మా ర్కులు జాతీయ సగటును మించి ఉండటం గత పదేళ్ల అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ ఫిరాయింపులపై పెట్టే దృష్టి.. రాష్ట్రాభివృద్ధిపై పెడితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. -
తప్పుడు ప్రచారం మానుకోండి.. బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారని కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. ఇప్పటికైనా రైతుల్లో అయోమయం సృష్టించడం మానేసి మా నుంచి మీరు నేర్చుకోంది. మీరు చేయలేని పనులు మేము చేస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మా పార్టీ సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హౌసింగ్ జీవోపైనా ఇష్టానుసారం మాట్లాడారు’ అంటూ సీరియస్ అయ్యారు.ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నెర్రెలు వాచిన కథ మనం చూశాం. మళ్లీ కుంగుతున్నట్టు ప్రజలు చెబితేనే మాకు తెలిసింది. ఇప్పటికే కాళేశ్వరంపై విచారణ కమిషన్ పనిచేస్తోంది. మిగతా ఇంకా ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని ముందుకు వెళ్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
చిరుకు జగ్గారెడ్డి చురకలు
హైదరాబాద్, సాక్షి: రైతులకు నష్టం జరుగుతుందని పలు సినిమాలు తీసిన చిరంజీవి... ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నాడని ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రుణమాఫీ హామీ నెరవేర్చిన తరుణంలో ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై, అలాగే నటుడు చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో రుణమాఫీ పైసలతో ఫోన్లు అన్ని టింగు టింగుమంటుంన్నాయి. ఆగస్టు 15 లోపు 2 లక్షల మాఫీ అయిపోతుంది. దీనికి సాక్ష్యం రైతులే. ఫోన్ లలో మెసేజ్ లు చూసి రైతు ల ఇళ్ళలో సంబరాలు జరుగుతున్నాయి. కానీ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్రలేదు. కేటీఆర్ ట్విట్టర్ కే పనికొస్తడు.. పనికి పనికిరాడు. మా ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉన్నా.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చాం... ఇప్పటిదాకా బీజేపీ ఎన్నివేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది? దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటోళ్లకు రూ.16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది. కానీ, ఒక్క రైతుకైనా చేసిందా?. గతంలో.. దేశం మొత్తం 71 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే చెల్లింది. .. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో ధర్నా చేసిన వారికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?. పవన్ కల్యాణ్కు, బీజేపీ వాళ్లకే ఎందుకు మద్దతు ఇస్తున్నారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు(చిరును ఉద్దేశించి..) రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు?. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, మోదీకి మద్దతు ఇస్తున్నారు!. రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్కు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు. కాంగ్రెస్లో ఉంటే చిరంజీవి సరైన దారి లో ఉండేవాడు. ఇప్పుడు పక్కదారి పట్టాడు అని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు... బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులే. కేసీఆర్ గత పదేళ్ళలో రూ.7 లక్షల కోట్ల ఆప్పులు చేసి రైతులకు ఇచ్చింది 26 వేల కోట్ల రూపాయలే. కాంగ్రెస్ గత 6 నెలల్లో రైతులకు ఇచ్చింది రూ. 31 వేల కోట్లు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ఖూనీ చేసింది. అటు కేంద్రంలో బీజేపీ నల్ల చట్టాలతో రైతులను మర్డర్ చేసింది. కేంద్ర మంత్రుల కొడుకులు రైతు ల మీద నుంచి బండ్లు ఎక్కించారు అని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. -
‘చారాణ కోడికి.. బారాణ మసాలా..!’ రైతు రుణమాఫీపై కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు మరోసారి విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని విమర్శలు గుప్పించారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక ఆందోళనలో ఉంటే.. ప్రభుత్వం ఎందుకీ సంబరాలు జరుపుతోందని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ? లేక ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా? అని నిలదీశౠరు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు‘సీఎం రేవంత్ రెడ్డి గారు...ఊరించి.. ఊరించి..ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలైనై..!!అన్నివిధాలా అర్హత ఉన్నా..ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు...రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు...అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక..అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు ?నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ?ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ?రెండు సీజన్లు అయినా..రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేజూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే..!!కౌలు రైతులకు.. ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!రైతు కూలీలకు.. రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!మభ్యపెట్టే మీ పాలన గురించి..ఒక్క మాటలో చెప్పాలంటే..ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..!ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!!జై తెలంగాణ’సీఎం గారు...ఊరించి.. ఊరించి..ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”రుణమాఫీ అయిన రైతులకన్నా..కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!రైతుమాఫీ…— KTR (@KTRBRS) July 19, 2024 -
పావు వంతు రైతులే అర్హులా?
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ పేరిట రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం రైతాంగాన్ని మరో మారు మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతుబంధు కింద జూన్లో రైతులకు ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి రూ.7 వేల కోట్లను రుణమాఫీ కోసం దారి మళ్లించిందని కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంత మొత్తాన్ని విదిల్చి రుణమాఫీ చేస్తున్నట్లుగా పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. 40 లక్షల మంది రైతులు లక్ష రూపాయల రుణం తీసుకుంటే 11 లక్షల మందిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులే అర్హత సాధించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2014లోనే రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు రూ. 16,144 కోట్లు వెచి్చంచి.. సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుపై పోలీసు సి బ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయా లని కేటీఆర్ ‘ఎక్స్’లో కోరారు. ఓ వాహనదారుడిని పోలీసులు దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని ప్రస్తావిస్తూ దీన్ని పోస్ట్ చేశారు. పౌరుడిపై పోలీసులు వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పోలీసు శాఖ, డీజీపీకి ఇది అంగీకారయోగ్యమైన భాషేనా అని ప్రశ్నించారు.