సాక్షి, చెన్నై: ప్రేమ, కులాంతర వివాహాలు చేసుకునే వారికి భరోసా ఇస్తూ తమిళనాడులోని మధురైలో ప్రత్యేక విభాగం ఆవిర్భవించింది. మధురై కోర్టు ఆదేశాల మేరకు క్రైం ప్రివెన్షల్ సెల్(సీపీసీ)గా ఈ విభాగం ఏర్పాటు అయింది. మూడు విభాగాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ విభాగానికి ప్రత్యేక అధికారిని నియమించారు. అలాగే, ప్రేమికుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను ప్రకటించారు.
ఇటీవల తమిళనాడులో కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో అధికారికంగా వంద మంది వరకు పరువు హత్యలకు గురైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అనధికారికంగా ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయని అంచనా. ప్రధానంగా దక్షిణ, పశ్చిమ తమిళనాడులో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పరువు కోసం తమ కుమార్తెలను చంపడమో, లేకపోతే తాము చావడమో చేస్తున్నారు. గత ఏడాది తిరుప్పూర్లో నడీ రోడ్డు మీద శంకర్ అనే యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన వీడియో బయటకు రావడంతో మద్రాస్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామన్నట్టుగా హైకోర్టు భరోసా ఇచ్చింది. అయినా, పరువుహత్యలు ఆగకపోవడంతో కోర్టు కన్నెర్ర చేసింది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకు రావడంతో పాటుగా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఇందుకు గాను ప్రత్యేక నిధిని, ప్రత్యేక విభాగం ఏర్పాటుకు కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నెలాఖరులో కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత కూడా ఆదివారం సేలం ఆత్తూరులో తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందన్న వేదనతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కోర్టు తీర్పులో తొలి అడుగుగా దక్షిణ తమిళనాడుకు కేంద్రంగా ఉన్న మధురైలో సీపీసీ ఆవిర్భవించడం విశేషం.
ప్రత్యేక వింగ్తో భరోసా : మదురై జిల్లా పోలీసు యంత్రాంగం, నగర పోలీసు కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రేమికులకు భరోసా ఇస్తూ ప్రత్యేక వింగ్, క్రైం ప్రివెన్షన్ సెల్ (సీపీసీ)ను సోమవారం ఏర్పాటు చేశారు. పోలీసు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆది ద్రావిడ సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ఈవిభాగం పనిచేస్తుంది. అళగర్ ఆలయ మెయిన్ రోడ్డులోని కమిషనరేట్ ఆవరణలో ఈ విభాగం కోసం ప్రత్యేక వసతులతో విశాలమైన గదిని కేటాయించారు. ఇక్కడికి వచ్చే ఫిర్యాదుల మేరకు తక్షణం ఈ విభాగం స్పందిస్తుంది. ప్రేమికులకు భద్రత కల్పించడం, తల్లిదండ్రుల్ని పిలిపించి చర్చలు జరపడంతో పాటుగా కౌన్సిలింగ్ తదితర వ్యవహారాలు, కేసుల నమోదు మీద ఈ విభాగం ప్రాథమికంగా దృష్టి పెట్టనుంది. ఈ విభాగం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరును ప్రకటించారు. ఆ మేరకు 0452–2346302 నంబరును సంప్రదించాలని సూచించారు. దశల వారీగా ఈ విభాగాల్ని ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు కాబోతున్నాయి.
లవర్స్ కోసం స్పెషల్ టోల్ ఫ్రీ నంబర్
Published Mon, Aug 7 2017 7:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement