బస్సు దగ్ధం, మహిళ సజీవ దహనం | Karnataka RTC Bus Catches Fire in Bangalore | Sakshi
Sakshi News home page

బస్సు దగ్ధం, మహిళ సజీవ దహనం

Feb 21 2017 9:15 AM | Updated on Sep 5 2017 4:16 AM

బస్సు దగ్ధం, మహిళ సజీవ దహనం

బస్సు దగ్ధం, మహిళ సజీవ దహనం

కర్ణాటక ఆర్టీసీబస్సు ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది.

బెంగళూరు: కర్ణాటక ఆర్టీసీబస్సు ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. చిక్‌ మంగుళూరు నుంచి బెంగళూరుకు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగంతో ఈ ఘటన చోటుచేసుకుంది. భాగ్యమ్మ అనే మహిళ సజీవ దహనమైంది. బస్సులోని ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో ప్రాణనష్టం తగ్గింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ఉన్నారు. బస్సు ఇంజిన్ లో తలెత్తిన లోపం కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement