కరెంటు షాక్ తో రైతు మృతి


నేరేడుగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం బోరిగాంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివాజీ(30) అనే యువరైతు వ్యవసాయం పొలం వద్ద కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ మార్చుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top