నీటి సంపులో పడి చిన్నారి | child died after fal in water tank | Sakshi
Sakshi News home page

నీటి సంపులో పడి చిన్నారి

Jan 13 2017 3:41 PM | Updated on Oct 19 2018 7:59 PM

నల్లగొండ జిల్లా దేవరకొండలో విషాద సంఘటన వెలుగు చూసింది.

దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండలో విషాద సంఘటన వెలుగు చూసింది. పండుగకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ చిన్నారి నీటి సంపులో పడి మృతిచెందాడు. చండూరుకు చెందిన యాదయ్య, యాదమ్మ దంపతులు సంక్రాంతి పండుగకు దేవరకొండ హనుమాన్‌నగర్‌లోని అత్తగారింటికి వెళ్లారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంత పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో యాదయ్య యాదమ్మ దంపతుల రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటిసంపులో పడ్డాడు. ఎవరు గుర్తించకపోవడంతో నీట మునిగి మృతిచెందాడు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement