ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టుల మృతి | 4 naxals killed in Bijapur last night by security forces | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టుల మృతి

Jul 11 2016 2:40 PM | Updated on Sep 4 2017 4:37 AM

కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.

బీజాపూర్: కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్కు 5 కిలో మీటర్ల దూరంలోని టుమ్నర్ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది.

మావోయిస్టులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బీజాపూర్ అడిషనల్ ఎస్పీ మోహిత్ మార్గ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దర్ని కమాండెర్ ఉకేష్, సెక్షన్ కమాండెర్ రాజుగా గుర్తించారు. మావోయిస్టుల నుంచి పోలీసులు రెండు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement