జిల్లాలోని వెంకటాపురం(నుగూరు)మండల పరిధిలోని సూరావిడు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ముగ్గురు మిలీషియా సభ్యులు అరెస్ట్
Apr 19 2017 11:50 AM | Updated on Aug 20 2018 4:44 PM
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని వెంకటాపురం(నుగూరు)మండల పరిధిలోని సూరావిడు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు వారిని మిలీషియా సభ్యులు మాడివి ఇడమ, రౌతు హనుమయ్య, కర్సుం నేగష్గా గుర్తించారు. వీరిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏఎస్పీ రాహుల్ బుధవారం విలేకరులకు తెలిపారు.
Advertisement


