నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని అడివిదేవరపల్లిని మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన యువకులు మంగళవారం సెల్టవర్ ఎక్కారు.
సెల్ టవర్ ఎక్కిన యువకులు
Oct 4 2016 4:43 PM | Updated on Aug 1 2018 2:35 PM
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని అడివిదేవరపల్లిని మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన యువకులు మంగళవారం సెల్టవర్ ఎక్కారు. అడివిదేవరపల్లిలో రాస్తారోకో, ధర్నా నిర్వహించిన గ్రామస్తులు అనంతరం సెల్టవర్ ఎక్కి హల్చల్ చేస్తున్నారు. మండల కేంద్రంగా ప్రకటించేవరకూ కిందకు దిగేదిలేదని వారు భీష్మించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Advertisement


