నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని అడివిదేవరపల్లిని మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన యువకులు మంగళవారం సెల్టవర్ ఎక్కారు.
సెల్ టవర్ ఎక్కిన యువకులు
Oct 4 2016 4:43 PM | Updated on Aug 1 2018 2:35 PM
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని అడివిదేవరపల్లిని మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన యువకులు మంగళవారం సెల్టవర్ ఎక్కారు. అడివిదేవరపల్లిలో రాస్తారోకో, ధర్నా నిర్వహించిన గ్రామస్తులు అనంతరం సెల్టవర్ ఎక్కి హల్చల్ చేస్తున్నారు. మండల కేంద్రంగా ప్రకటించేవరకూ కిందకు దిగేదిలేదని వారు భీష్మించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Advertisement
Advertisement