మీడియా సమావేశం లేకుండానే... | Without a media conference ... | Sakshi
Sakshi News home page

మీడియా సమావేశం లేకుండానే...

Mar 14 2014 12:49 AM | Updated on Oct 9 2018 6:34 PM

మీడియా సమావేశం లేకుండానే... - Sakshi

మీడియా సమావేశం లేకుండానే...

టి20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని రద్దు చేశారు.

 న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని రద్దు చేశారు. జట్టు బంగ్లాదేశ్ బయల్దేరడానికి ముందు ఇది జరగాల్సి ఉంది. ఇటీవలి పరాజయాలు, ఫిక్సింగ్‌కు సంబంధించిన వివాదాల నేపథ్యంలో కెప్టెన్‌తో సహా ఏ ఒక్క ఆటగాడిని కూడా మీడియా ముందుకు పంపేందుకు బీసీసీఐ ఇష్ట పడటం లేదు.

రాబోయే టోర్నీ లేదా సిరీస్‌లలో జట్టు ప్రణాళికలు, వ్యూహాలపై సాధారణంగా కెప్టెన్ మాట్లాడటం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ రివాజును తోసిరాజంటూ భారత బోర్డు వ్యవహరించింది. ఆటగాళ్లకు సమయం లేకపోవడం వల్లే దీనిని రద్దు చేశామంటూ బీసీసీఐ వివరణ ఇచ్చింది. శుక్రవారం ఉదయం ధోని సేన బంగ్లాదేశ్‌కు బయల్దేరుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement