యథాతథంగా వైజాగ్ వన్డే! | Vizag ODI to be put away! | Sakshi
Sakshi News home page

యథాతథంగా వైజాగ్ వన్డే!

Oct 20 2016 1:39 AM | Updated on Sep 4 2017 5:42 PM

యథాతథంగా వైజాగ్ వన్డే!

యథాతథంగా వైజాగ్ వన్డే!

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 29న విశాఖపట్నంలో జరగాల్సిన ఐదో వన్డేపై నెలకొన్న సందేహాలు తొలగిపోయారుు.

విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 29న విశాఖపట్నంలో జరగాల్సిన ఐదో వన్డేపై నెలకొన్న సందేహాలు తొలగిపోయారుు. ఇక్కడి వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని పిచ్ వన్డే మ్యాచ్ నిర్వహణ కోసం సిద్ధంగా లేకపోవడం వల్ల వేదిక మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చారుు.


అరుుతే ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం వైజాగ్‌లోనే జరగనుంది. బుధవారం బీసీసీఐ జనరల్ మేనేజర్ (ఆపరేషన్‌‌స) ఎంవీ శ్రీధర్, బోర్డు క్యురేటర్ ఇక్కడి పిచ్‌ను పరిశీలించారు. పూర్తి తనిఖీ తర్వాత పిచ్‌పై వారిద్దరు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ’వైజాగ్ స్టేడియంలో అంతా బాగుంది’ అని వ్యాఖ్యానించిన బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మ్యాచ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.  ఇదే స్టేడియంలో నవంబర్ 17నుంచి భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు కూడా జరగనుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement