ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు | The two changes in the team | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు

Dec 1 2016 12:55 AM | Updated on Sep 4 2017 9:32 PM

ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు

ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు

భారత్‌తో చివరి రెండు టెస్టులకు గాను ఇంగ్లండ్ జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేశారు.

జట్టుతో చేరనున్న జెన్నింగ్స్, డాసన్
వోక్స్‌కు కూడా గాయం

న్యూఢిల్లీ: భారత్‌తో చివరి రెండు టెస్టులకు గాను ఇంగ్లండ్ జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేశారు. గాయపడ్డ ఓపెనర్ హమీద్ స్థానంలో కీటన్ జెన్నింగ్‌‌స... స్పిన్నర్ అన్సారీ స్థానంలో ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ జట్టుతో చేరనున్నారు. హమీద్ స్వదేశానికి వెళ్లగా... అన్సారీ మాత్రం జట్టుతో పాటే ఉండి చికిత్స తీసుకుంటాడు.

ఐపీఎల్‌లో బెంగళూరు కోచ్‌గా పని చేస్తున్న రే జెన్సింగ్‌‌స కుమారుడు కీటన్ జెన్నింగ్‌‌స. ఈ రెండు మార్పులను ప్రకటించిన తర్వాత ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ వోక్స్ బొటనవేలి గాయం తీవ్రమైంది. దీంతో తను నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చు.

 

Advertisement
 
Advertisement
Advertisement