
ధావన్ సెంచరీ.. పటిష్ట స్థితిలో భారత్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు.
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. 349 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 32 ఓవర్లలో వికెట్ నష్టానికి 242 పరుగులు చేసింది. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ధావన్, 92 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఆసీస్ స్పిన్నర్ లియోన్ వేసిన ఇన్నింగ్స్ 31వ ఓవర్లో 94 పరుగుల వద్ద ఉన్న ధావన్ రెండు ఫోర్లు కొట్టి సెంచరీ మార్కును చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 92 పరుగులు, ధావన్ 105 పరుగులతో క్రీజులో ఉన్నారు.