
మళ్లీ పాతకథే రిపీట్ అయింది
మళ్లీ పాతకథే రిపీట్ అయింది. వరుసగా మూడు వన్డేలలో ఓటమి పాలైన టీమిండియా నాల్గో వన్డేలోనూ చేతులెత్తేసింది.
కాన్బెర్రా: మళ్లీ పాతకథే రిపీట్ అయింది. వరుసగా మూడు వన్డేలలో ఓటమి పాలైన టీమిండియా నాల్గో వన్డేలోనూ చేతులెత్తేసింది. తమది ఆరంభశూరత్వమేనని టీమిండియా ఆటగాళ్లు మరోసారి నిరూపించుకున్నారు. గెలుపు ముంగిట మరోసారి చతికిల పడ్డారు.
కాన్బెర్రాలో బుధవారం ఆసీస్తో జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 349 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు చేశారు. ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ (107) సెంచరీ చేయగా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (93) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్ స్మిత్ (29 బంతుల్లో 51) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ మార్ష్ 33 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో ఇషాంత్ 4, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీశారు.
కోహ్లీ (106), ధావన్ (126) అద్బుతంగా రాణించి రెండో వికెట్కు 212 పరుగుల భాగస్వాయ్యం నమోదు చేసినప్పటికీ జట్టును మరో ఓటమి నుంచి తప్పించలేకపోయింది. జట్టు స్కోరు 277 పరుగుల వరకు భారత్ పటిష్టస్థితిలోనే ఉంది. కానీ, అదే స్కోరు వద్ద రెండు కీలక వికెట్లు కోల్పోవడం భారత్ను దెబ్బతీసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో రిచర్డ్ సన్ ఐదు వికెట్లు పడగొట్టి భారత్ నడ్డివిరిచాడు. హ్యాస్టింగ్స్, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్ నాథన్ లియోన్కు ఒక వికెట్ దక్కింది.
భారత్ ఇన్నింగ్స్:
ఓపెనర్ రోహిత్ శర్మ చాలా వేగంగా ఆడాడు. 25 బంతుల్లో 41 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో నిష్ర్కమించాడు. అయితే, ధోనీ, గురుకీరత్ విఫలమయ్యారు. చివర్లో రవీంద్ర జడేజా 28 నాటౌట్ పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించగలిగాడు, కానీ జట్టును ఓటమి నుంచి తప్పించలేక పోయాడు.
మ్యాచ్ మలుపు తిరిగింది ఇక్కడే :
ఆరంభంలో అదరగొట్టిన టీమిండియా 38వ ఓవర్ నుంచి వెనుకంజ వేసింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి హ్యాస్టింగ్స్ భారత్ను దెబ్బతీశాడు. హ్యాస్టింగ్స్ వేసిన 38వ ఓవర్లో మూడో బంతికి సెంచరీ వీరుడు ధావన్ (113బంతుల్లో 126 పరుగులు: 14x4, 2x6) బెయిలీ చేతికి చిక్కాడు. దీంతో 212 పరుగుల రెండో వికెట్ భారీ భాగస్వాయ్యానికి తెరపడిండి. జట్టు స్కోరు 277 పరుగుల వద్దే.. అదే ఓవర్ చివరి బంతికి కెప్టెన్ ధోనీ(0) డకౌటయ్యాడు. ఆసీస్ కీపర్ మథ్యూ వేడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
తన వరుస రెండు ఓవర్లో ఒక్కో వికెట్ తీసి రిచర్డ్ సన్ భారత్ను మరింత దెబ్బతీశాడు. 40 ఓవర్ తొలి బంతికి సెంచరీ వీరుడు కోహ్లీ (92 బంతుల్లో 106; 11x4 1x6) ఓటయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే జట్టు స్కోర్ 286 వద్ద గురుకీరత్ సింగ్ ఔటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్యాట్స్మన్, ఫామ్ లో ఉన్న అజింక్యా రహానే కేవలం 2 పరుగులే చేసి ఆరో వికెట్ గా పెవిలియన్ బాట పట్టాడు. రిషి ధావన్ ఓ పోర్ సాయంతో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. విజయానికి 24 మరో 38 పరుగులు కావాలి.