
ధావన్ హాఫ్ సెంచరీ
ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు.
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. ధావన్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ శతకం బాదాడు. 349 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దీటుగా ఆడుతోంది.
ధోనీసేన 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 133 పరుగులు చేసింది. ధావన్, కోహ్లీ (40) బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (41) అవుటయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కంగారూలు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు చేశారు.