ధావన్, కోహ్లీ సెంచరీలు | Teamindia batting kohli century | Sakshi
Sakshi News home page

ధావన్, కోహ్లీ సెంచరీలు

Jan 20 2016 3:35 PM | Updated on Sep 3 2017 3:59 PM

ధావన్, కోహ్లీ సెంచరీలు

ధావన్, కోహ్లీ సెంచరీలు

వరుసగా మూడు వన్డేల్లో ఓటమిపాలై ఆస్ట్రేలియాకు సిరీస్ కోల్పోయిన టీమిండియా నాలుగో వన్డేలో రాణిస్తోంది.

కాన్బెర్రా: వరుసగా మూడు వన్డేల్లో ఓటమిపాలై ఆస్ట్రేలియాకు సిరీస్ కోల్పోయిన టీమిండియా నాలుగో వన్డేలో రాణిస్తోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్, వన్ డౌన్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సెంచరీలు సాధించారు. 349 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 36 ఓవర్లలో వికెట్ నష్టానికి 265 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్  36వ ఓవర్లో కోహ్లీ సెంచరీ మార్కు చేరుకున్నాడు.

అతి తక్కువ ఇన్నింగ్స్లలో 25 సెంచరీలు నమోదు చేసిన తొలి బ్యాట్స్మన్ గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఆసీస్ స్పిన్నర్ లియోన్ వేసిన ఇన్నింగ్స్ 31వ ఓవర్లో 94 పరుగుల వద్ద ఉన్న ధావన్ రెండు ఫోర్లు కొట్టి సెంచరీ మార్కును చేరుకున్నాడు.  ప్రస్తుతం కోహ్లీ 104 పరుగులు, ధావన్ 115 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్ కు ఒక వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement